ఏనుగు కుంభస్థలాన్ని బద్దలు కొట్టి కోటీశ్వరులయ్యే రాశులవారు వీరేనన్న విపరీత రాజయోగం!
2025 సంవత్సరంలో గ్రహాల సంచారం అన్ని రాశుల వారి జీవితాలలో ప్రభావం చూపిస్తుంది. ఈ సంవత్సరం బృహస్పతి సంచారం కారణంగా విపరీత రాజయోగం ఏర్పడుతుంది. దేవతల గురువైన బృహస్పతి 13 నెలలకు ఒకసారి తన రాశిని మార్చుకుంటుంది. 2025 సంవత్సరంలో బృహస్పతి మూడు సార్లు తన రాశి చక్రాన్ని మార్చుకుంటుంది.
2025లో బృహస్పతి సంచారం
2025లో మొదటిసారిగా మే 15వ తేదీన బృహస్పతి మిధున రాశిలోనూ, ఆ తర్వాత అక్టోబర్ 19వ తేదీన కర్కాటక రాశిలో రెండవసారి బృహస్పతి సంచారం చేయనుంది. మళ్లీ 2025 సంవత్సరంలో నవంబర్ 11న బృహస్పతి కర్కాటక రాశిలో ఉన్నప్పుడు తిరోగమన దిశలో సంచారం చేస్తుంది.

బృహస్పతి కారణంగా విపరీత రాజయోగం
ఆ తర్వాత మళ్లీ అదే స్థితిలో డిసెంబర్ 4వ తేదీన మిధున రాశిలోకి వెళ్తాడు. ఇక 2025లో బృహస్పతి సంచారం కారణంగా విపరీత రాజయోగం ఏర్పడుతుంది. రెండు రాశుల్లోకి మూడుసార్లు బృహస్పతి సంచారం కారణంగా కొన్ని రాశులవారికి అదృష్టం కలిసివస్తుంది. ఈ రాజయోగం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని ఇస్తుంది. మరి ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.
మేష రాశి
బృహస్పతి మేషరాశిలో మూడవ ఇంటిని చూడడం వల్ల విపరీత రాజయోగం ఏర్పడుతుంది. గురు భగవానుడి విపరీత రాజయోగం మేష రాశి వారి జీవితంలో భారీ అభివృద్ధిని తీసుకురాబోతుంది. ఇది మేష రాశి జాతకుల యొక్క హోదాను పెంచుతుంది. ఈ సమయంలో వీరే పని చేసిన విజయవంతం అవుతుంది. వ్యాపారంలో గొప్ప పురోగతితో పాటు కీర్తి ప్రతిష్టలు వస్తాయి. ఊహించని ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి.
వృషభ రాశి
వృషభ రాశిలో బృహస్పతి 6వ ఇంటిని చూస్తున్నాడు. దీనివల్ల వృషభ రాశి జాతకులకు విపరీత రాజయోగం సానుకూల ఫలితాలను ఇస్తుంది. కొత్త ఇల్లు భూములు వాహనాలు కొనుగోలు చేస్తారు. అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి మంచి ఆరోగ్యం కూడా ప్రాప్తిస్తుంది. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు తొలగిపోయి సంతోషంగా జీవిస్తారు.
సింహరాశి
విపరీత రాజయోగం వల్ల సింహరాశి జాతకులకు ఆర్థిక లబ్ధి చేకూరుతుంది. ఈ సంవత్సరం తులా రాశి వారికి బాగా కలిసి వస్తుంది. సింహరాశిలో లాభదాయకమైన స్థానంలో బృహస్పతి ఉండటం వల్ల సింహరాశి జాతకులకు సానుకూల ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో వీరు ఏ పని చేసిన వీరికి కలిసి వస్తుంది.
తులారాశి
తులా రాశిలో బృహస్పతి 9వ ఇంటిని చూస్తాడు. తొమ్మిదో ఇంట్లో గురువు సంచారం తులారాశి జాతకులకు మేలు చేస్తుంది. ఈ సమయంలో తులా రాశి వారు మెరుగైన ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు.
మిధున రాశి
మిధున రాశి వారి జీవితం బృహస్పతి సంచారం కారణంగా బాగుంటుంది. ఈ సమయంలో మిధున రాశి వారికి లాభాలు వెల్లువగా మారుతాయి. మిధున రాశి వారి ఆరోగ్యంలో గొప్ప మెరుగుదల ఉంటుంది. విదేశీ పర్యటనలు కలిసి వస్తాయి. మిధున రాశి వారికి ఈ సంవత్సరం ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుంది.
కుంభరాశి
కుంభరాశిలో ఐదవ ఇంటిని బృహస్పతి చూస్తాడు. విపరీత రాజయోగం వీరికి ఆర్థిక ప్రయోజనాలను తీసుకురాబోతుంది. ఇది అన్ని విధాల కుంభరాశి జాతకులకు శుభ సమయం. ఈ కారణంగా కుంభ రాశి వారు ఈ సంవత్సరం ఉత్తమ ఫలితాలను పొందబోతున్నారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications