ఈ వాస్తు దోషాలతో ఇంట్లో వాళ్లకు రోగాలు పక్కా!
వాస్తు శాస్త్రం మనిషి జీవితాన్ని సానుకూలంగా ముందుకు నడిపేలా చేస్తుంది. అందుకే ఎవరు ఏ నిర్మాణం చేపట్టాలన్నా వాస్తు చూసుకొని మరీ చేస్తారు. అటువంటి వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిని నిర్మించుకుంటే ఇంట్లో వస్తువులను కూడా వాస్తు ప్రకారం పెట్టుకుంటే, ఆ ఇంట్లో సమస్యలు పెద్దగా ఉండవని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతారు.
రోగాలకు కారణం అయ్యే వాస్తు దోషాలు
వాస్తు ప్రకారం ఇల్లును నిర్మించుకోక పోయిన, వాస్తు ప్రకారం ఎక్కడి వస్తువులు అక్కడ పెట్టుకోక పోయినా కూడా దాని ప్రభావం ఇంట్లో జీవించే వారి పైన ఉంటుందని చెబుతున్నారు. వాస్తు దోషాలు ఉన్న ఇల్లు రోగాలతో, అనారోగ్య సమస్యలతో ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అయితే ప్రస్తుతం మనం రోగాలకు కారణమయ్యే వాస్తు దోషాలను గురించి తెలుసుకుందాం.

వాస్తు దోషాలు ఉంటే శారీరక, మానసిక సమస్యలు
వాస్తు దోషాలు ఉన్న ఇంట్లో రకరకాల శారీరక, మానసిక సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. వాస్తు నియమాల ప్రకారం బావులు లేదా కుళాయిలు వంటి నీటితో సంబంధం ఉన్న ఏదైనా దక్షిణం మరియు పడమర దిశల మధ్య ఉండకూడదని వాస్తు శాస్త్రం చెబుతుంది. అసలు ఈ దిశలో వాషింగ్ మెషిన్ కానీ వాష్ బేసిన్ కానీ ఏర్పాటు చేయడం కూడా మంచిది కాదని సూచిస్తుంది.
నైరుతిలోను వాస్తుదోషాలతో ఆరోగ్య సమస్యలు
నీటితో సంబంధం ఉన్నవి దక్షిణం మరియు పడమర దిక్కులలో ఉంటే ఆ ఇంట్లోని వారు రోగాల పాలవుతారు. ఈశాన్యంలో వంటగది ఉంటే ఆ కుటుంబంలోని వారికి ఆరోగ్య సమస్యలు వస్తాయి. నైరుతిలోను వాస్తుదోషాలు ఉంటే ఆర్థిక సమస్యలతో పాటు వారు ఆరోగ్య సమస్యలు కూడా ఎదుర్కోవలసి వస్తుంది. తూర్పు దిశలో వాస్తు దోషం, లేదా ఏదైనా అడ్డు ఉంటే వారు నరాల బలహీనతను, గుండె జబ్బులను, కంటి సమస్యలను ఎదుర్కొంటారు.
ఈ వాస్తు దోషాలు ఉన్నా రోగాలే
తూర్పు బహిర్గత ద్వారంలో వాస్తు దోషాలు ఉంటే ఉదర సంబంధమైన సమస్యలు, జీర్ణ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇక చాలామంది ఎలక్ట్రానిక్ పరికరాలను బెడ్ మీద పెట్టుకుంటారు. వారు మానసిక సమస్యలను, గుండె సమస్యలను ఎదుర్కొంటారు. అంతేకాదు జీరో వైబ్రేషన్ ఎనర్జీతో కూడిన మెటాలిక్ ఫర్నిచర్ వాడడం వల్ల కూడా ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది.
మందులు ఆ దిశలో పెట్టినా రోగాలు తగ్గవు
ఇంట్లో ఎవరైనా జబ్బుతో బాధపడుతుంటే వారి మందులను దక్షిణం వైపు పెడితే వారికి వ్యాధి నయం కాకపోగా, మరింత సమస్యాత్మకంగా మారుతుంది ఇన్వర్టర్ ల వంటి పెద్ద పెద్ద బరువైన వస్తువులను ఈశాన్యం లేదా ఉత్తర దిశలో ఉంచకూడదని చెబుతున్నారు. ఈశాన్య దిశను, ఉత్తర దిశను ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని, ఆ రెండు దిశలలో శుభ్రంగా లేకపోతే వాస్తు దోషం తలెత్తి కుటుంబంలోని వారు రోగాల పాలవుతారని చెబుతున్నారు.
disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.
-
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications