కొద్ది గంటల్లోనే ఈ రాశులవారి రాత మారిపోతోంది!
జ్యోతిష్యంలో బుధుడిని గ్రహాలకు యువరాజుగా పరిగణిస్తారు. మేధస్సు, కమ్యూనికేషన్స్, తర్కానికి కారకుడిగా భావిస్తారు. వ్యక్తి జాతకంలో బుధుడు శుభప్రదంగా ఉంటే ఆ వ్యక్తి పేరున్న వ్యాపారవేత్త అవుతారు. ప్రతి సమస్యను తెలివితేటలతో సులువుగా పరిష్కరిస్తారు. ప్రస్తుతం మేషరాశిలో తిరోగమనంలో ఉన్న బుధుడి కదలిక మరికొద్ది గంటల్లోనే ప్రారంభమవబోతోంది. జాతకంలో మెర్క్యురీ బలంగా ఉంటే కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. అంతేకాకుండా వ్యాపారం వృద్ధి చెందుతుంది. మే 15వ తేదీ రాత్రి 8.30 గంటలకు మేషరాశిలో సంచరించనున్నాడు. ఈ ప్రభావం కొన్ని రాశులకు సానుకూలంగా ఉంటే మరికొన్ని రాశులకు ప్రతికూలంగా ఉంటోంది. ఏయే రాశులనేది ఇప్పుడు తెలుసుకుందాం.
సింహరాశి:ఈ రాశి వారి జాతకంలోని 9వ ఇంట్లో బుధుడు సంచరించబోతున్నాడు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. గతంలో మధ్యలోనే ఆగిపోయిన పనులన్నీ ఇప్పుడు పూర్తవుతాయి. శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించడంతోపాటు వ్యాపారస్తులు లాభాలను గడిస్తారు. ఆధ్యాత్మికతవైపు ఆసక్తి పెరుగుతుంది. విదేశీ ప్రయాణం త్వరలోనే పలకరించనుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది.
కర్కాటకరాశి:వీరికి బుధుడు అనుకూల ఫలితాలనిస్తున్నాడు. పనిచేసేచోట తగిన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగ నిమిత్తం లేదంటే వ్యాపార పనుల నిమిత్తం విదేశాలకు వెళతారు. కెరీర్ లో పురోగతి ఉంటుంది. అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. గతం నుంచి ఉద్యోగం మారాలని ప్రయత్నించేవారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. కొత్త కొత్త ఆలోచనలతో కెరీర్ లో ముందుకు సాగుతారు.
కన్యారాశి:ఈ రాశివారి వ్యాపారం విస్తరిస్తుంది. కుటుంబ నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. పోటీపరీక్షల్లో విజయం సాధించడమే కాకుండా ఆకస్మికంగా ధనలాభం పొందుతారు. ఉద్యోగులకు ప్రమోషన్ వస్తుంది. గతంలో అప్పుగా ఇచ్చి ఎంతకీ తిరిగిరాని డబ్బు ఇప్పుడు తిరిగి వస్తుంది. స్టాక్ మార్కెట్ తో సంబంధం ఉన్నవారు పూర్తిగా లాభపడతారు. పూర్వీకుల ఆస్తి కలిసివస్తుంది.
ధనస్సు రాశి:ఈ రాశివారికి కీర్తిప్రతిష్టలు కలుగుతాయి. జీవితానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటారు. వ్యాపారంలో భారీ డీల్స్ కుదురుతాయి. అలాగే కెరీర్ లో మంచిస్థాయికి చేరుకుంటారు. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవడంతోపాటు చేపట్టే ప్రతి పనిలో విజయం లభిస్తుంది. పెద్ద పెద్ద స్థానాల్లో ఉండే వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. దీనివల్ల భవిష్యత్తులో మంచి ప్రయోజనాలు కలుగుతాయి.