అదృష్టాన్ని మోసుకొస్తున్న శని... 2027 వరకు ఈ రాశులకు తిరుగులేదు..
శనిదేవుడు అంటే చేసిన కర్మల ప్రకారం ఫలితాలను ప్రసాదించేవాడు. నిజాయితీగా ఉండేవారికి రెట్టింపు లాభాలను ప్రసాదిస్తాడు. ఒక రాశి నుంచి మరో రాశిలోకి సంచారం చేయడానికి రెండున్నర సంవత్సరాల సమయం తీసుకుంటాడు. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత మీనరాశిలో సంచారం చేస్తోంది. ఈ ప్రభావం కొన్ని రాశులకు మేలు కలిగిస్తే, మరికొన్ని రాశులకు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. వాటి వివరాలను తెలుసుకుందాం.
తులారాశి
ఉద్యోగస్థులు మాత్రం అద్భుతమైన విజయాలను నమోదు చేస్తారు. ఎన్నో రకాల సమస్యల నుంచి బయటపడతారు. దీనివల్ల మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. కొంత ఉపశమనం లభిస్తుంది. కోరుకున్న కోరికలన్నీ నెరవేరతాయి. ప్రత్యర్థుల నుంచి ఎటువంటి ఇబ్బందులు ఎదురుకావు. ఆర్థిక లాభాలు కలగడంవల్ల జీవితం ప్రశాంతంగా గడిచిపోతుంది.

మిథున రాశి
ఉద్యోగస్తులకు కొత్త కొత్త అవకాశాలు తులపుతడతాయి. వాటిని ఉపయోగించుకున్నవారికి వృద్ధి నమోదవుతుంది. సంపాదన కూడా భారీగా పెరుగుతుంది. ఆర్థిక సంబంధమైన విషయాల్లో మాత్రం చాలా సులువుగా విజయాలను సాధిస్తారు. కుటుంబ సభ్యులు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సంబంధించిన సేవల్లో పాల్గొంటే మంచిది. 2027 వరకు ఒకరకంగా వీరికి తిరుగులేదని చెప్పొచ్చు. అలా అని అహంకారపూరితంగా ప్రవర్తిస్తే శనిదేవుడే కఠిన పాఠం నేర్పుతాడు.
ధనస్సు రాశి
ఈ రాశివారు ఎటువంటి పని తలపెట్టినా గొప్ప అదృష్టాన్ని పొందుతారు. సంపద వెల్లువలా వస్తుంది. సమయాన్ని కూడా చక్కగా ఉపయోగించుకుంటారు. కొన్నాళ్లుగా ఉన్న కోరికలన్నీ నెరవేరతాయి. గతంలోకంటే ఇప్పుడు ఆర్థికంగా బలపడతారు. ఈ రాశివారి నాలుగో పాదంలో శనిదేవుడు ఉంటాడు.
మేష రాశి వారికి ఏలినాటి శని మొదటి దశ, మీన రాశి వారికి ఏలినాటి శని రెండవ దశ, కుంభరాశి వారికి చివరి దశ నడుస్తోంది. వీరు ఎల్లవేళలా జాగ్రత్తగా ఉండాలి.ఎదురయ్యే అడ్డంకులను తట్టుకోవాలి. సమస్యలు వస్తాయి. తట్టుకోవాలి. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక సమస్యలు కూడా ఉంటాయి. వీటినుంచి బయట పడాలంటే నవగ్రహాలకు ప్రదక్షిణ ప్రతిరోజు చేయడంతోపాటు శనిదేవుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేసి దీపం వెలిగించాలి. శనిదేవుడికి సంబంధించిన మంత్రం చదవాలి. ప్రదోష కాలంలో అయితే చాలా మంచిది.












Click it and Unblock the Notifications