మే 31వరకు వీరికి తిరుగులేదు.. అంతా కాసుల వర్షమే అంటున్న శుక్రుడు!
ప్రస్తుతం శుక్రుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. జనవరి 28వ తేదీన ఉదయం ఏడు గంటల రెండు నిమిషాలకు శుక్రుడు మీనరాశిలోకి ప్రవేశించాడు. శుక్రుడు మీనరాశిలో మే 31వ తేదీ వరకు సంచారం చేస్తాడు. అనంతరం మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. ఇక ఈ మధ్య కాలంలో శుక్రుడు మీనరాశిలో తిరోగమనం చెందుతాడు.
మీనరాశిలో శుక్ర సంచారం
మళ్ళీ ఏప్రిల్ 13వ తేదీన ప్రత్యక్ష రవాణా అవుతాడు. ఇక మీనరాశి లోకి ప్రవేశించిన శుక్రుడు మాలవ్య రాజయోగాన్ని ఏర్పరిచాడు. ఇక శుక్రుడు మీనరాశి సంచారం కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన లాభాలను తెచ్చిపెడుతుంది. మే 31వ తేదీ వరకు శుక్రుడి దయతో కలిసి వచ్చే ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

వృషభ రాశి
మీనరాశిలో శుక్ర సంచారంతో వృషభ రాశి వారికి ప్రయోజనం చేకూరుతుంది. ఈ సమయంలో వృషభ రాశి వారి ఆదాయం పెరుగుతుంది .ఉద్యోగాలు చేసేవారు మంచి విజయాలను సాధిస్తారు. ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు లాభాలు వస్తాయి. జీవిత భాగస్వామితో సంబంధాలు మెరుగుపడతాయి. వృషభ రాశి వారి సమస్యలు ఈ సమయంలో తొలగిపోతాయి.
సింహరాశి
మీనరాశిలో శుక్ర సంచారం సింహ రాశి వారికి శుభాలను కలిగిస్తుంది. రానున్న రోజుల్లో సింహ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోయి సంతోషంగా ఉంటారు. సింహరాశి వారి సొంత ఇంటి కల నెరవేరుతుంది. ఆర్దిక పరిస్థితి గతంలో కన్నా మెరుగ్గా ఉంటుంది. ఇది సింహరాశి వారికి శుభాలను చేకూర్చే సమయం.
కుంభరాశి
మీనరాశిలో శుక్ర సంచారంతో కుంభ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. కుంభరాశి జాతకులు ఈ సమయంలో ఆర్థికంగా ప్రయోజనాలను పొందుతారు. వర్తక వ్యాపారాల విస్తరణకు కూడా ఇది మంచి సమయం. కుంభ రాశి వారి వైవాహిక జీవితం సంతోషంగా సాగుతుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వస్తాయి. వేతనం పెరుగుతుంది. ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి లాభాలు వస్తాయి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications