శ్రీమన్నారాయణుడికి ప్రీతికరమైన ఆ రోజున ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు
హిందూ ధర్మంలో ఏకాదశి తిథికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఏకాదశి వ్రతం చేయడం వల్ల శ్రీ మహావిష్ణువు విశేష అనుగ్రహం లభిస్తుందని, జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు. ప్రతి నెలలో రెండు ఏకాదశి తిథులు వస్తాయి. ఒకటి శుక్ల పక్షంలో, మరొకటి కృష్ణ పక్షంలో.
ఆషాఢ మాసంలోని శుక్ల పక్ష ఏకాదశిని 'యోగినీ ఏకాదశి' అంటారు. ఈ ఏకాదశి మూడు లోకాల్లోనూ చాలా ప్రసిద్ధి చెందినదిగా చెబుతారు. ఈ రోజున శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తారు. ఈ వ్రతం చేయడం వల్ల జీవితంలో సుఖ సంతోషాలు వస్తాయని, పాపాలు తొలగిపోతాయని విశ్వాసం.

యోగినీ ఏకాదశి 2025: తేదీ, శుభ ముహూర్తం..
పంచాంగం ప్రకారం, ఆషాఢ మాసంలోని శుక్ల పక్ష ఏకాదశి తిథి 2025 జూన్ 21న వస్తుంది. వైదిక పంచాంగం ప్రకారం, ఏకాదశి తిథి 2025 జూన్ 21న ఉదయం 7:18 గంటలకు ప్రారంభమవుతుంది. జూన్ 22న ఉదయం 4:27 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం, వ్రతం 2025 జూన్ 21 శనివారం నాడు ఆచరిస్తారు. వ్రతం చేసే భక్తులు ఈ రోజు ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవిని ఆరాధిస్తారు.
శుభ ముహూర్తం:
- పూజకు శుభ ముహూర్తం - ఉదయం 7:21 నుండి 7:41 వరకు
- బ్రహ్మ ముహూర్తం - ఉదయం 04:04 నుండి 04:44 వరకు
- విజయ ముహూర్తం - మధ్యాహ్నం 02:43 నుండి 03:39 వరకు
- గోధూళి ముహూర్తం - సాయంత్రం 07:21 నుండి 07:41 వరకు
- నిషిత ముహూర్తం - రాత్రి 12:00 నుండి జూన్ 3 రాత్రి 12:43 వరకు
యోగిని ఏకాదశి వ్రత పారణ
యోగినీ ఏకాదశి వ్రత పారాయణను మరుసటి రోజు అంటే 2025 జూన్ 22న చేస్తారు. ఈ రోజు పారణ చేసేందుకు శుభ సమయం మధ్యాహ్నం 1:47 నుండి సాయంత్రం 4:35 వరకు ఉంటుంది. పారాయణ చేసే సమయంలో సాత్విక భోజనం చేయాలని, భగవంతుని స్మరిస్తూ ఆహారాన్ని తీసుకోవాలి.
యోగిని ఏకాదశి: పూజా విధానం
యోగినీ ఏకాదశి వ్రతం దశమి తిథి సాయంత్రం నుండే ప్రారంభమవుతుంది. దశమి రోజున గోధుమలు, పెసలు, జొన్నలు, ఉప్పు తీసుకోకూడదు. ఏకాదశి రోజు ఉదయం స్నానం చేసి వ్రత సంకల్పం చేసుకోవాలి. పూజా స్థలంలో కలశంలో నీటిని నింపి, శ్రీ మహావిష్ణువు విగ్రహం లేదా చిత్రం ముందు దీపం వెలిగించాలి.
ఆ తరువాత భగవంతునికి పువ్వులు, పండ్లు, తులసి ఆకులు సమర్పించాలి. విష్ణు సహస్రనామం లేదా 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అనే మంత్రాన్ని జపించాలి. చివరగా హారతి ఇచ్చి నైవేద్యం సమర్పించాలి. నైవేద్యంలో తులసి ఆకులు తప్పనిసరిగా ఉంచాలి. అప్పుడే పూజ పూర్తవుతుందని నమ్ముతారు.
యోగిని ఏకాదశి: ప్రాముఖ్యత
పురాణాల ప్రకారం, యోగినీ ఏకాదశి వ్రతం చాలా పవిత్రమైనది. ఈ రోజున వ్రతం చేసి శ్రీ మహావిష్ణువును పూజించడం వల్ల 88,000 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టినంత పుణ్యం లభిస్తుంది. ఈ వ్రతం చేయడం వల్ల పాపాలు తొలగిపోతాయని, దారిద్ర్యం నశిస్తుందని నమ్ముతారు. అంతేకాకుండా, జీవితంలో ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోయి సుఖ సంతోషాలు కలుగుతాయి.
పూజ సమయంలో జపించవలసిన మంత్రాలు
విష్ణు గాయత్రి మంత్రం: ఓం శ్రీ విష్ణవే చ విద్మహే వాసుదేవాయ ధీమహి। తన్నో విష్ణుః ప్రచోదయాత్॥
విష్ణు మంగళ మంత్రం: మంగళం భగవాన్ విష్ణుః, మంగళం గరుడధ్వజః। మంగళం పుండరీ కాక్షః, మంగళాయ తనో హరిః॥
యోగినీ ఏకాదశి వ్రతం ఆచరించడం ద్వారా శ్రీ మహావిష్ణువు అనుగ్రహం పొందవచ్చని భక్తులు విశ్వసిస్తారు. ఈ వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించడం వల్ల జీవితంలో సకల శుభాలు కలుగుతాయని నమ్మకం.
Disclaimer: ఈ కథనంలో ఇచ్చిన సమాచారం వివిధ మాధ్యమాల ద్వారా సేకరించినది. పాఠకులకు యోగినీ ఏకాదశి గురించి తెలియజేయడానికి ఉద్దేశించినది మాత్రమే.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications