నిర్మలమ్మ వచ్చే.. రుణాలు ఇచ్చే! లబ్ధిదారులకు నేడు రూ.3,216 కోట్లు విడుదల

పల్నాడు గడ్డపై సరికొత్త ఆర్థిక విప్లవానికి వేదిక సిద్ధమైంది. వెనుకబడిన ఈ ప్రాంతంలో పేదరికాన్ని పారద్రోలి, పారిశ్రామిక, సామాజిక అభివృద్ధికి సరికొత్త ఊతం ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ రుణమేళాను (క్రెడిట్ అవుట్‌రీచ్ ప్రోగ్రామ్) నిర్వహిస్తోంది. కేంద్ర ప్రభుత్వ పథకాలను నేరుగా లబ్ధిదారుల చెంతకే చేర్చే ఈ బృహత్తర కార్యక్రమానికి నరసరావుపేటలోని కోడెల శివప్రసాదరావు క్రీడా ప్రాంగణం వేదిక కానుంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథులుగా విచ్చేసి అర్హులైన 1,03,246 మంది లబ్ధిదారులకు ఏకంగా రూ.3,216 కోట్ల భారీ రుణాలను పంపిణీ చేయనున్నారు.

ఇంటి వద్దకే బ్యాంకులు.. సరికొత్త విధానం

గతంలో సామాన్యులు, చిరు వ్యాపారులు బ్యాంకుల చుట్టూ తిరిగినా రుణాలు దొరకక, ప్రైవేటు వడ్డీ వ్యాపారుల బారిన పడి నష్టపోయిన పరిస్థితులు ఉండేవి. ఈ దుస్థితికి స్వస్తి పలుకుతూ 'ప్రజల వద్దకే బ్యాంకులు - ఇంటి వద్దకే రుణాలు' అనే వినూత్న విధానాన్ని తీసుకొచ్చారు. కేవలం పాత అకౌంట్లను సర్దుబాటు చేయడం కాకుండా, కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న 20 రకాల పథకాల ద్వారా సరికొత్త లబ్ధిదారులను ఎంపిక చేసి బ్యాంకర్ల ద్వారా నేరుగా రుణాలు మంజూరు చేయిస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు చురుగ్గా భాగస్వామ్యమయ్యాయి.

Nirmala Sitharaman Distributes Rs 3216 Crore Loans to 1 Lakh Beneficiaries in Palnadu Mega Credit Outreach

ఆకట్టుకుంటున్న ప్రత్యేక విభాగాలు

ఈ ఆర్థిక చేదోడులో భాగంగా పల్నాడు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక కార్యాచరణను రూపొందించారు. పల్నాడు జిల్లాలోని 28 మండలాల్లో ప్రత్యేకంగా 'మహిళా క్లస్టర్ల' ఏర్పాటు చేశారు. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా ఆదివాసీల వ్యవసాయ భూములను కుదువ పెట్టుకుని కూడా బ్యాంకర్లు రుణాలు మంజూరు చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. జిల్లాలోని 7 గ్రామాలను ఒక యూనిట్‌గా ఎంపిక చేసి, 'పీఎం సూర్య ఘర్' పథకం కింద ప్రతి ఇంటికీ సోలార్ రుణాలు అందజేయనున్నారు. ఈ మెగా మేళాలో కిసాన్ క్రెడిట్ కార్డులు, డ్వాక్రా సంఘాలు, ముద్ర, పీఎంఈజీపీ, గృహ నిర్మాణం, వాహన, విద్యా రుణాలు సహా వివిధ రంగాల లబ్ధిదారులకు భారీ ఆర్థిక సాయం అందనుంది.

భారీ ఏర్పాట్లు.. పటిష్ఠ బందోబస్తు

ఈ మెగా రుణ పండగకు అధికారులు సర్వసిద్ధం చేశారు. బహిరంగ సభకు దాదాపు 30 వేల మంది ప్రజలు హాజరయ్యేలా ఏర్పాట్లు చేశారు. లబ్ధిదారుల రవాణా కోసం సుమారు 600 బస్సులను సిద్ధం చేసినట్లు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. సభా ప్రాంగణంలో మండలాల వారీగా 24 గ్యాలరీలను ఏర్పాటు చేసి, పర్యవేక్షణ బాధ్యతలను ఆయా మండల తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, ఎంపీడీవోలకు అప్పగించారు.

మరోవైపు భద్రతా పరంగా జిల్లా ఇన్‌ఛార్జి ఎస్పీ బి.ఉమామహేశ్వర్‌ పర్యవేక్షణలో 1500 మందికి పైగా పోలీసులతో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. హెలీప్యాడ్ నుంచి సభావేదిక వరకు సీసీ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఉంచారు. రైతులు, స్వయం సహాయక సంఘాల మహిళలు, చిరు వ్యాపారులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల ఆర్థిక బలోపేతమే లక్ష్యంగా సాగుతున్న ఈ మెగా రుణమేళా పల్నాడు ప్రగతి పథంలో ఒక మైలురాయిగా నిలవనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+