ప్రభుత్వంపైకాంగ్రెస్ హక్కుల నోటీసు
హైదరాబాద్: రాష్ట్రప్రభుత్వంపై సభా హక్కుల నోటీసు ఇవ్వనున్నట్లుకాంగ్రెస్ అధికార ప్రతినిధి కె.రోశయ్యచెప్పారు. విదేశీ పెట్టుబడులపై రాష్ట్ర ప్రభుత్వం శాసనసభను తప్పుదారి పట్టించిందని ఆయన బుధవారం విలేకరులసమావేశంలో విమర్శించారు. విదేశీపెట్టుబడులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇంతకుముందు శాసనసభ సమావేశాల్లో ఇచ్చిన వివరాలకు ప్రస్తుతబడ్జెట్ సమావేశంలో చూపిన వివరాలకు పొంతనలేదని ఆయన అన్నారు. తప్పుడు లెక్కలు చూపి రాష్ట్ర ప్రభుత్వం శాసనసభనుమోసం చేసిందని ఆయన వ్యాఖ్యానించారు.
రాష్ట్ర ప్రభుత్వం 45 వేల కోట్లఅప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని రాష్ట్ర భారతీయ జనతా పార్టీ(బిజెపి) విమర్శించింది. విదేశీ రుణాలనుఉత్పాదక రంగంలో పెట్టకపోవడం వల్ల రాష్ట్రం తీవ్ర సమస్యనుఎదుర్కోనున్నదని బిజెపి రాష్ట్ర ప్రధానకార్యదర్శి కె. హరిబాబు అన్నారు. మూత పడినపరిశ్రమలపై అఖిల పక్ష సమావేశం ఏర్పాటుచేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్చేశారు.