రాష్ట్రానికి అన్నీ శుభాలే
హైదరాబాద్: వృష నామసంవత్సరాల్లో జరుగుతాయని పంచాంగ శ్రవణ పండితులుచెప్పారు. వర్షాలు సకాలంలో కురిసి పంటలు బాగాపండుతాయని, వ్యవసాయానికి శుభప్రదాలను ఈసంవత్సరం తెస్తుందని అన్నారు. మహిళలు అద్భుతవిజయాలు సాధిస్తారని చెప్పారు. అన్ని రంగాల్లో మహిళలుముందడుగు వేస్తారని అన్నారు. కాల సర్ప దోషాలున్నావాటిని రాష్ట్రం అధిగమిస్తుందని వారు అభిప్రాయ పడ్డారు.
రాష్ట్ర ప్రభుత్వం ఘనంగానిర్వహించిన ఉగాది ఉత్సవ కార్యక్రమంలోఅధికార భాషా సంఘం అధ్యక్షుడు నాగఫణి శర్మ పంచాంగ శ్రవణంచేశారు. కేంద్ర, రాష్ట్ర సంబంధాలు మెరుగవుతాయనిఆయన చెప్పారు. కొన్ని వివాదాస్పదాంశాలు ముందుకువచ్చినా అవి సజావుగా, మృదువుగాపరిష్కారమవుతాయని ఆయన చెప్పారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రినారా చంద్రబాబునాయుడు కవులను, పండితులను,సాహితీవేత్తలను సన్మానించారు. కాలసర్పదోషం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయని, ప్రజలు అప్రమత్తంగా వుండాలని గణపతిసచ్చిదానంద స్వామి అన్నారు.