వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏడాదిలో బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీ

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్‌సి, ఎస్‌టి బ్యాక్‌లాగ్‌ పోస్టులను ఏడాదిలోగా భర్తీ చేయనున్నట్టు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. గురువారం నాడు బాబు జగజ్జీవన్‌రామ్‌ 95వ జయంతి సందర్భంగా నిజాం కాలేజీ ఎదురుగా వున్న జగజ్జీవన్‌ రామ్‌ విగ్రహానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ఇతర నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా వివిధ సంఘాలకు చెందిన కార్యకర్తలు బ్యాక్‌లాగ్‌ పోస్టులు భర్తీ చేయాలని నినాదాలు చేయడంతో ఏడాదిలోగా ఈ పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్య తీసుకుంటుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. కొత్తగా నిర్మించిన సాంఘిక సంక్షేమ శాఖ భవన్‌ను ఆయన ప్రారంభించారు. విద్యపై తమ ప్రభుత్వ ఎక్కువ శ్రద్ధ చూపిస్తుందని ఆయన చెప్పారు. జగజ్జీవన్‌రామ్‌కు భారతరత్న పురస్కారం ప్రకటించేలా తాము కేంద్రంపై వత్తిడి తెస్తామని చంద్రబాబు ప్రకటించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X