వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పాక్, ఇరాన్ దోస్తీనిదెబ్బ తీయం
షిరాజ్: పాకిస్థాన్, ఇరాన్ దేశాల మధ్య సంబంధాలనుదెబ్బ తీసే యోచన తమకు లేదని భారత ప్రధానిఅటల్ బిహారీ వాజ్పేయి స్పష్టం చేశారు. ఈ విషయంలోఇరాన్తో భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్నికుదుర్చుకుందనే వార్తలను ఆయన ఖండించారు. తననాలుగు రోజుల ఇరాన్ పర్యటనను ముగించుకునిఆయన శుక్రవారం షిరాజ్ చేరుకున్నారు. తనఇరాన్ పర్యటన విజయవంతమైందని ఆయనచెప్పారు.
ఇరు దేశాల మధ్య సంబంధాలు పటిష్టం కావడానికి తన పర్యటన దోహదంచేసిందని ఆయన అన్నారు. ఇరాన్తో తాలిబన్లవ్యవహారాలపై విస్తృతంగా చర్చించినట్లుఆయన తెలిపారు. ఇరాన్తో చమురు, సహజవాయువు, తదితరరంగాల్లో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు ఆయన తెలిపారు. అంతర్జాతీయ తీవ్రవాదం, మంతఛాందసవాదం పెరిగి పోవడం పట్ల ఉభయదేశాలు ఆందోళన వ్యక్తం చేసినట్లు ఆయనచెప్పారు.
Story first published: Friday, April 13, 2001, 23:53 [IST]