ెమ డే ఉత్సవాల్లో మంటలు
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా మంగళవారం నాడు జరిగిన అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం మే డే సందర్భంగా లండన్, బెర్లిన్, సిడ్నీ నగరాల్లో పెద్దఎత్తున జరిగిన ప్రదర్శనల్లో హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. పెట్టుబడిదారి విధానాలకు బలమైన దుర్గాలుగా పేరున్న దేశాల్లోనే ఈ ఏడాది మే డే ఉత్సవాల్లో కార్మికులు ప్రపంచీకరణకు వ్యతిరేకంగా గళమెత్తడం విశేషం.
తైవాన్లో
కూడా
మే
డే
సందర్భంగా
వాతావరణం
ఉద్రిక్తంగా
మారింది.
లండన్లో
గత
ఏడాది
అనుభవాల
దృష్ట్యా
పోలీసులు
పెద్దఎత్తున
బందోబస్తు
చర్యలు
చేపట్టినప్పటికీ
ఫలితం
లేకుండాపోయింది.
సిడ్నీలో
పోలీసులకు
ప్రదర్శనకారులకు
మధ్య
ఘర్షణ
జరిగింది.
క్యూబాలో
మాత్రం
ప్రశాంతంగా
మేడే
ఉత్సవాలు
ప్రభుత్వ
ఆధ్వర్యంలో
జరిగాయి.
దాదాపు
మూడు
నాలుగు
దశాబ్దాల
తర్వాత
మళ్లీ
అంతర్జాతీయంగా
పెట్టుబడిదారి
విధానాలకు
వ్యతిరేకంగా
కార్మికవర్గంలో
నిరసన
ధ్వనులు
పెద్దఎత్తున
వ్యక్తం
అవుతున్నాయని
పరిశీలకులు
అంటున్నారు.