For Daily Alerts
ఇంటర్ రిజల్ట్స్ మరో అయిదురోజుల్లో?
హైదరాబాద్: ఇంటర్మీడియెట్ పరీక్షా ఫలితాలు జూన్ తొలివారం చివర వెలువడే అవకాశం వుంది. మే ఆఖరులోగా ఫలితాలను విడుదల చేస్తామని ఇంటర్మీడియెట్ బోర్డు, విద్యాశాఖ మంత్రి అనేక ప్రకటనలు చేసినప్పటికీ చివరకు ఫలితాల ప్రకటనలో జాప్యం అనివార్యమైంది. విత్హెల్డ్ కేసులను సాధ్యమైనంత మేర తగ్గించాలని, ఫలితాల్లో ఏలాంటి తప్పులు లేకుండా జాగ్రత్తపడాలని ప్రయత్నించడం వల్ల ఈ జాప్యం జరిగిందని బోర్డు వర్గాలు చెప్పాయి.
ఇప్పుడున్న పరిస్థితిని బట్టి జూన్ 4న ఇంటర్ ఫస్టియర్, జూన్ 6న ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలను ప్రకటించే అవకాశం వున్నదని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఇదిలా వుండగా ఎంసెట్ రిజల్ట్స్ కూడా మరో రెండు మూడు వారాల్లో విడుదలయ్యే అవకాశం వుంది. జూన్ 15 కల్లా ఎంసెట్ ఫలితాల వెల్లడికి ముమ్మరంగా ప్రయత్నిస్తున్నట్టుగా అధికార వర్గాలు వెల్లడించాయి.
Story first published: Thursday, May 31, 2001, 23:53 [IST]