వెద్యపరంగా మరణించిన దీపేంద్ర!
ఖాట్మండూః నేపాల్ రాజు బీరేంద్రను కాల్చి చంపిన దీపేంద్ర వైద్య పరంగా మరణించినట్లు వార్తలు వెలువడ్డాయి. తన తల్లిదండ్రులతో పాటు మరో 9 మంది రాజకుంటుంబ సభ్యులను మెషిన్ గన్ తో కాల్చి చంపి, ఆ తరువాత తాను కూడా కాల్చుకున్న దీపేంద్రనుమిలటరీ ఆస్పత్రికి తరలించారు. ఆయన కోమాలో వున్నాడని మాత్రం ఖాట్మండూ లోనిమిలటరీ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. అతను కణతపై తుపాకితో కాల్చుకున్న దరిమిలా బతికే అవకాశాలు ఏ మాత్రం లేవని వైద్య నిపుణులు చెబుతున్నారు.
శుక్రవారం రాత్రి జరిగిన సంఘటన అనంరం అత్యంత నాటకీయంగా జరిగిన పరిణామాలలో భాగంగా ఇంత కిరాతకానికి ఒడిగట్టిన దీపేంద్రనే నేపాల్ రాజుగా రాజపరిషత్ ప్రకటించింది. అయితే తాత్కాలిక రాజుగా బీరేంద్ర సోదరుడువీరేంద్ర వ్యవహరిస్తారని ప్రకటించింది. అయితే దీపేంద్ర వైద్య పరంగా మరణించినట్లేనని తెలిసినప్పటికీ అతనని రాజుగా ప్రకటించడం నేపాల్ లో సంచనలం సృష్టించింది. రాకుమారుడుఅయినందువల్ల అతనినే వారసుడుగా ప్రకటించినట్లు రాజపరిషత్ చెప్పింది. అయితే ఇంత ఘాతుకానికి ఒడిగట్టిన దీపేంద్రను రాజుగా ప్రకటించడంతో నేపాల్ నిరసన వెల్లువెత్తుతున్నది.
వైద్య
పరంగా
మరణించిన
దీపేంద్రను
రాజుగా
ప్రకటించడం
కంటే
దీపేంద్రకే
పట్టం
కట్టి
వుంటే
ప్రజల
ఆగ్రహాన్ని
చవిచూడాల్సి
వచ్చేది
కాదని
భావిస్తున్నారు.
పొరుగుదేశమైన
నేపాల్
లో
కేవలం
24
గంటల్లో
జరిగిన
ఈ
సంఘటనలు
భారత్
లో
సైతం
ప్రకంపనాలు
సృష్టించాయి.
- భారత్దిగ్భ్రాంతి-మూడురోజుల సంతాపం
- తండ్రిని చంపిన దీపేంద్రుడే నేపాల్ రాజు
- ెనపాల్ ఆఖరు సామ్రాట్టు
- రాజకుటుంబాన్ని బలిగొన్న ప్రేమ
-
నేపాల్
రాజ
దంపతుల
హత్య