వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బిజెపి జాతీయ ఉపాధ్యక్షుడిగా రామారావు
హైదరాబాద్ః ఆంధ్రప్రదేశ్ బిజెపిసీనియర్ నాయకుడు, పార్టీ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు వి. రామారావు బిజెపి జాతీయ ఉపాధ్యక్షునిగా ఎంపికయ్యారు. పార్టీ అధ్యక్షుడు జానా కృష్ణమూర్తి బుధవారం ఈవిషయాన్ని ప్రకటించారు. ఈ మేరకు వర్తమానంఅందుకోగానే రామారావు హుటాహుటిన ఢిల్లీ బయలుదేరి వెళ్ళారు.
తెహల్కా వ్యవహారంతో ఆంధ్రప్రదేశ్ కు చెందిన బంగారు లక్ష్మణ్ పార్టీ అధ్యక్షపదవి నుంచి వైదొలిగినవిషయం విదితమే. ఆ తరువాత జానా కృష్ణమూర్తికి పార్టీ పగ్గాలు అప్పగించారు.
అయితే ఆంధ్ర ప్రదేశ్ కు కీలక పదవి అప్పగించాలనే ఉద్దేశ్యంతో ప్రస్తుతం క్రమశిక్షణా సంఘం సభ్యునిగా వున్న వి.రామారావును పార్టీ ఉపాధ్యక్షుడిగా ప్రకటించారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటును సమర్థించే రామారావు ఉపాధ్యక్ష పదవి చేపట్టిన అనంతరం ఎటువంటి వైఖరి అవలంబిస్తారో వేచి చూడాలి.
Story first published: Sunday, June 17, 2001, 23:53 [IST]