నీడను చూసే భయపడుతున్న వార్ Home Full Story
హైదరాబాద్: పీపుల్స్వార్ తన నీడను చూసి తానే భయపడుతున్నదని రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ హెచ్కె దొర వ్యాఖ్యానించారు. కోవర్ట్ ఆపరేషన్స్కు కుట్రపన్నుతున్నారన్న ఆరోపణతో వార్ తమ దళసభ్యులు 10 మందిని కాల్చిచంపిన సంఘటనపై వ్యాఖ్యానిస్తూ మృతుల్లో ఎవరితోనూ పోలీసులకు సంబంధం లేదని డిజిపి స్పష్టం చేశారు.
కోవర్ట్ ఆపరేషన్ కోసం 12 మందిని పీపుల్స్వార్ దళాల్లోకి పంపగలిగే అవకాశమే తమకుంటే ఈ పాటికే వార్ను తుడిచిపెట్టి వుండేవారమని ఆయన అన్నారు. వార్ హత్య చేసినవారిలో ఎవరూ పోలీసులతో సంబంధం వున్నవారు కాదని ఆయన స్పష్టం చేసిన డిజిపి, ఈ హత్యలకు వార్లోని ముఠాతగాదాలు కారణం కావచ్చని అన్నారు. పీపుల్స్వార్లో అంతర్గత కలహాలు అనేకం వున్నాయని డబ్బులు తీసుకుని పారిపోయిన వారు, పార్టీనాయకత్వంపై విశ్వాసం లేదని బయటకువచ్చినవారు అనేకమంది వున్నారని ఆయన వ్యాఖ్యానించారు.