వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐటిఎఎ సదస్సులో మహాజన్‌

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఐటి అసోసియేషన్‌ ఆఫ్‌ అమెరికా నిర్వహిస్తున్న 40వ ఎగ్జిక్యూటీవ్‌ మానేజ్‌మెంట్‌ సదస్సుకు హాజరవుతున్న సిఐఐ బృందానికి కేంద్ర ఐటి శాఖ మంత్రి ప్రమోద్‌ మహాజన్‌ నాయకత్వం వహిస్తున్నారు. ఈ సదస్సుతో పాటే సిఇవోల శిఖరాగ్ర సమావేశం కూడా నిర్వహిస్తున్నారు.

మూడు రోజుల పాటు జరుగుతున్న ఈ సదస్సులో ఐటి మంత్రి ప్రమోద్‌ మహాజన్‌ ముఖ్యప్రసంగం కూడా చేస్తారు. ఈ సందర్భంగా అమెరికాలోని ప్రముఖ ఐటి కంపెనీల అధిపతులు, ప్రతినిధులతో మహాజన్‌ ముఖాముఖి చర్చలు కూడా జరుపుతారు. అమెరికాలోని ఐటి వ్యాపార రంగానికి ఐటిఎఎ ఏకైక ప్రతినిధి. అమెరికా ఐటి వ్యాపారం విలువ మొత్తం 74000 కోట్ల డాలర్లు వుంటుందని అంచనా.

ఈ సంస్థ వార్షిక సదస్సును అమెరికా వాణిజ్య, పారిశ్రామిక రంగానికి సంబంధించిన అతిపెద్ద ఈవెంట్‌గా చెబుతారు. దాదాపు 500 మంది సిఇవోలు, మానేజ్‌మెంట్‌ ప్రతినిధులు పాల్గొంటున్న ఈ సదస్సు ప్రాధాన్యతను గుర్తించే సిఐఐ ప్రత్యేకంగా ఐటి బృందాన్నిపంపిస్తున్నది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X