వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముషర్రాఫ్‌తో చర్చలకు పార్టీలుదూరం

By Staff
|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్‌: భారత ప్రధానిఅటల్‌ బిహారీ వాజ్‌పేయితో జరిగే శిఖరాగ్ర సమావేశం గురించి అధ్యక్షుడుపర్వేజ్‌ ముషర్రాఫ్‌తో చర్చలు జరిపేందుకుపాకిస్థాన్‌కు చెందిన రెండు ప్రధాన రాజకీయ పార్టీలునిరాకరించాయి. వాజ్‌పేయితో జులై 14-16 తేదీల్లోఆగ్రాలో జరిగే సమావేశం గురించి ఈ నెల 27వ తేదీనరాజకీయ నాయకులతో చర్చలు జరుపుతాననిముషర్రాఫ్‌ ప్రకటించారు. అయితే, పర్వేజ్‌ ముషర్రాఫ్‌నుకలుసుకోకూడదని పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ (పిపిపి),పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌-నవాజ్‌ (పిఎంఎల్‌-ఎన్‌) నిర్ణయించుకున్నాయి.

ఈ విధమైన సమావేశం ఏర్పాటు చేసే అర్హతముషర్రాఫ్‌కు లేదని పిఎంఎల్‌-ఎన్‌ యాక్టింగ్‌ప్రెసిడెంట్‌ జావెద్‌ హష్మి అన్నారు. తమ పార్టీకిఆహ్వానం అందనప్పటికీ ప్రజాస్వామ్యపునరుద్ధరణ కూటమి (ఎఆర్‌డి) భాగస్వామ్య పక్షంగా కూడాముషర్రాఫ్‌ సమావేశానికి వెళ్లబోమని ఆయన స్పష్టంచేశారు. ఎఆర్‌డిలో పిపిపి, ఎఎంఎల్‌లు ప్రధానభాగస్వామ్య పక్షాలు.

తమ పార్టీ తుది నిర్ణయం తీసుకోవాల్సివున్నదని ఎఆర్‌డి అధినేత నవాబ్‌జాదా నస్రుల్లాఖాన్‌ చెప్పారు. ముషర్రాఫ్‌ సమావేశానికి హాజరైతేఆయన అధ్యక్ష పదవిని చేపట్టడాన్ని సమర్థించినట్లవుతుందనిఎఆర్‌డిలోని మెజారిటీ పక్షాలు అభిప్రాయపడుతున్నాయి.

దేశంలోనూ, విదేశాల్లోనూముషర్రాఫ్‌ ప్రతిష్ట కోల్పోయారని, భారత్‌తోఆయన జరిపే చర్చలకు విలువ వుండదనిహష్మి అన్నారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా ముషర్రాప్‌గద్దె దిగి జాతీయ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలని, అది మూడు నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాలని, అప్పుడు భారత్‌జరిగే చర్చలకు ఎజెండా రూపొందించాలని ఆయనఅన్నారు.

ఇదిలా వుంటే, సర్దార్‌ ఫరూక్‌ఖాన్‌ లెఘరీ, ఇమ్రాన్‌ ఖాన్‌, తాహిరుల్‌ఖాద్రీ, వాసిం సజ్జాద్‌, ఎలాహి బక్షి సూమ్రో వంటిరాజకీయ నాయకులు తాము ముషర్రాఫ్‌ ఆహ్వానాన్నిమన్నిస్తామని ప్రకటించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X