వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
స్వయం సహాయానికి 100 కోట్లు
హైదరాబాద్: దేశవ్యాప్తంగా స్వయం సహాయక గ్రూప్ల ఏర్పాటు, సభ్యులకు శిక్షణ, రుణ వితరణ కోసం నాబార్డ్కు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ 100 కోట్ల రూపాయలను కేటాయిస్తున్నది. ఈ విషయం గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ప్రకటించారు.
సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లపై జాతీయ సదస్సు తర్వాత ఆదివారం నాడు ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఈ ఉద్యమానికి అత్యంత ప్రాధాన్యత నివ్వటానికి అన్ని రాష్ట్రాలు ముందుకొచ్చాయని చెప్పారు. సదస్సు ఫలితాలపై ప్రధానికి ఆర్ధిక మంత్రి, రిజర్వ్బ్యాంక్కు తాను ఒక నివేదికను ఇవ్వనున్నట్టుగా ఆయన వెల్లడించారు.
Comments
Story first published: Monday, June 25, 2001, 23:53 [IST]