వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఇద్దరు తెలుగు శాస్త్రవేత్తల విజయం Home Full Story
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్కు చెందిన ఇద్దరు శాస్త్రవేత్తలు ఔషధ పరిశోధనల్లో అపూర్వ విజయం సాధించారు. వీరు తయారు చేసిన బాధానివారిణికి అమెరికా పేటెంట్ హక్కులు లభించాయి. కృష్ణా జిల్లా మాచర్లకు చెందిన సి. జానకీరాం, ఖలీలుల్లాలు ఈ బాధానివారిణిని తయారు చేశారు.
ద్రవరూపంలో వుండే ఈ మందు పార్శ్వపు నొప్పులను, కీళ్ల నొప్పులను, ఇతర ఒంటి నొప్పులను సత్వరమే తగ్గిస్తుంది. ఈ ఔషధం తీసుకన్న 15 నిమిషాల్లో ప్రభావం చూపుతుంది. 24 గంటల పాటు దీని ఇది పని చేస్తుంది. జీవసంబంధమైన మూలికలతో ఈ ఔషదాన్ని తయారు చేసినట్లు సి. జానకీరాం చెప్పారు. ఈ మందును 200 మందిపై ప్రయోగించి పరిశీలించినట్లు, మంచి ఫలితాలు ఇచ్చినట్లు ఆయన తెలిపారు.
Comments
Story first published: Tuesday, June 26, 2001, 23:53 [IST]