టి.ఆర్. ప్రసాద్పదవీకాలం పొడిగింపు?
న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్కార్యదర్శి టి. ఆర్. ప్రసాద్ పదవీకాలం పొడిగించడానికిఅనువైన వాతావరణం ఏర్పడింది. కేబినెట్కార్యదర్శి పదవీ కాలాన్ని 62 ఏళ్ల వయసుకుపొడిగించేందుకు అవసరమైన మార్పులనుఆమోదిస్తూ కేంద్ర మంత్రి వర్గం మంగళవారంనిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్కుచెందిన టి.ఆర్. ప్రసాద్ పదవీకాలాన్ని పొడగించాలని జాతీయప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వాన్ని కాపాడుతూ వస్తున్నతెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రినారా చంద్రబాబునాయుడు కోరుతున్నారని వార్తలు వెలువడుతున్ననేపథ్యంలో కేంద్ర మంత్రి వర్గం ఆ నిర్ణయాన్ని తీసుకుంది.
ఇదిలా వుండగా కాంపిటీషన్ బిల్లును కూడాకేంద్ర మంత్రి వర్గం ఆమోదించింది. ఎంఆర్టిపిచట్టం స్థానే ఈ బిల్లును వచ్చే వర్షాకాలం పార్లమెంటుసమావేశాల్లో ప్రవేశ పెట్టాలని మంత్రి వర్గంనిర్ణయించింది. కాంపిటీషన్ బిల్లు ముసాయిదాను మంత్రివర్గం పరిశీలించి ఆమోదించింది. అనైతిక, అక్రమ పోటీని నివారించడానికికాంపిటీషన్ బిల్లును ప్రతిపాదిస్తున్నారు.