మొండికేసిన కేంద్ర మంత్రులు
చెన్నయ్ః తమిళనాడు ప్రభుత్వం అరెస్టు చేసిన కేంద్ర మంత్రులు మురసోలి మారన్, టి.ఆర్. బాలును విడుదల చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. తమను విడుదల చేయాలంటూ మేజిస్ట్రేట్ ఆదేశించినప్పటికీ విడుదలయ్యేందుకు కేంద్ర మంత్రులు నిరాకరించారు. తమపై పెట్టిన కేసులు ఉపసంహరించుకొనే వరకు జైలు నుంచి కదిలేది లేదని కేంద్ర మంత్రి టి.ఆర్. బాలు స్పష్టం చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మారన్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం అందింది.కరుణానిధి అరెస్టును అడ్డుకున్నరనే ఆరోపణపై మారన్, బాలును తమిళనాడు పోలీసులు అరెస్టు చేసిన విషయం విదితమే.
కేంద్ర మంత్రులు ఇద్దరినీ తక్షణం విడుదల చేయాల్సిందిగా చెన్నయ్ 18వ మెట్రొపాలిటన్ న్యాయమూర్తి సోమవారం ఆదేశాలు జారీ చేశారు. చెన్నయ్ అపోలో ఆస్పత్రిలో వున్న మారన్ కు కాపలాగా వున్న రాష్ట్ర పోలీసులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మరోవైపు వెల్లూరు జైలులో వున్న మరో కేంద్ర మంత్రి టి.ఆర్.బాలు తనపై పెట్టిన కేసును ఉపసంహరించుకొనేంత వరకు బయటకు వచ్చేది లేదని తేల్చి చెప్పారు.
జయ
సర్కార్
పై
ఒత్తిడి
పెంచేందుకే
కేంద్ర
మంత్రులు
ఈ
నిర్ణయం
తీసుకున్నారని
భావిస్తున్నారు.
- కరుణను కలిసిన ఎర్రంనాయుడు
- గురువాయురప్పకు ఏనుగునిచ్చిన జయ
- 3న రంగరాజన్ ప్రమాణ స్వీకారం
- తమిళనాడు బంద్ ప్రశాంతం
- ప్రభుత్వంపై కఠిన చర్యకు జార్జి సిఫార్సు
- ఫాతిమాపై వేటు-రంగరాజన్ కు బాధ్యతలు
- రాజ్యాంగాన్ని తుంగలో తొక్కిన జయః జార్జి
- నివేదిక పంపిన తమిళనాడు గవర్నర్
- కరుణను పరామర్శించిన జార్జి
- అట్టుడుకుతున్న తమిళనాడు
- జయలలితపై వాజ్ పేయి గరం
- జెలులో కరుణ సత్యాగ్రహం
- కరుణానిధి అరెస్టుః జైలుకు తరలింపు