వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
యుటిఐ చైర్మన్ రాజీనామా
ముంబాయి: యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా చైర్మన్ పిఎస్ సుబ్రహ్మణ్యం తమ పదవికి రాజీనామా చేశారు. యుటిఐ అతిపెద్ద స్కీమ్ యుఎస్-64లో కొనుగోళ్లు అమ్మకాలను ఆరునెలల పాటు సస్పెండ్ చేస్తూ యూనిట్ ట్రస్ట్ తీసుకున్న నిర్ణయం దరిమిలా ఉత్పన్నమైన సంక్షోభం ఆయన రాజీనామాకు దారితీసినట్టుగా తెలిసింది.
యుటిఐ నిర్ణయం దేశవ్యాప్తంగా వున్న రెండు కోట్ల మంది ఇన్వెస్టర్లను దిగ్ర్బాంతిలో ముంచెత్తింది. యుటిఐ నిర్ణయంపై దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం చెలరేగడంతో కేంద్రం జోక్యానికి ఆర్ధిక మంత్రి యశ్వంత్ సిన్హా హామీ ఇచ్చారు. యుటిఐ నిర్వహణను ప్రభుత్వం ప్రభుత్వం సమీక్షిస్తుందని ఆయన వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం యుటిఐ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేయడంతో రాజీనామాకు సుబ్రహ్మణ్యం నిర్ణయం తీసుకున్నారని తెలిసింది.
Comments
Story first published: Wednesday, July 4, 2001, 23:53 [IST]