అన్నాడిఎంకెకు పిఎంకె గుడ్బై
చెన్నై: తమిళనాడులో అధికార అన్నాడిఎంకె ఫ్రంట్ భాగస్వామిగా వున్న పిఎంకె ఫ్రంట్నుంచి వైదొలుగుతున్నట్టుగా ప్రకటించింది. అన్నాడిఎంకె అధినేత్రి వైఖరివల్ల తాము ఆ పార్టీనుంచి వైదొలగక తప్పలేదని పిఎంకె నేత రామదాసు ప్రకటించారు. తిరిగి ఎన్డిఎలో చేరే విషయం పరిశీలిస్తామని ఆయన చెప్పారు.
అన్నాడిఎంకె నుంచి ఎదురైన చేదు అనుభవాలన దృష్ట్యానే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన వెల్లడించారు. ఎన్నికలు పూర్తయి జయ అధికారపగ్గాలు చేపట్టిన నాటినుంచే ఈ రెండు పార్టీల మధ్య దూరం పెరుగుతూ వస్తున్నది. మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి అరెస్టును పిఎంకె నేత రామదాసు ఖండించడం జయలలితకు కంటగింపయింది. అరెస్టును ఖండించడమే కాకుండా జైలుకు వెళ్లి కరుణానిధిని పరామర్శించారు కూడా. అన్నాడిఎంకె కూటమిలోని ఏ నేత కూడా ఈ విధంగా ప్రవర్తించలేదు.












Click it and Unblock the Notifications