వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీపార్టీపైహురియత్‌లో విభేదాలు

By Staff
|
Google Oneindia TeluguNews

శ్రీనగర్‌: పాకిస్థాన్‌ అధ్యక్షుడుపర్వేజ్‌ ముషారఫ్‌ ఇచ్చి టీ పార్టీకి హాజరయ్యేవిషయమై ఆల్‌ పార్టీ హురియత్‌ కాన్ఫరెన్స్‌లో విభేదాలుపొడసూపాయి. టీ పార్టీకి హాజరు కాబోమనిజె.కె.ఎల్‌.ఎఫ్‌. తాత్కాలిక చైర్మన్‌ బషీర్‌ అహ్మద్‌చెప్పారు. టీ పార్టీకి హాజరవుతామని హురియత్‌కాన్ఫరెన్స్‌ అధ్యక్షుడు అబ్దుల్‌ గనీ భట్‌ ఏకపక్షంగానిర్ణయం తీసుకున్నారని ఆయన విమర్శించారు.

టీ పార్టీకి హాజరయ్యేవిషయమై హరియత్‌ కాన్ఫరెన్స్‌ కార్యనిర్వాహకవర్గం చర్చించనే లేదని ఆయన అన్నారు.భాగస్వామ్య పక్షాలను సంప్రదించకుండా టీ పార్టీకిహాజరు కావాలని గనీ భట్‌ నిర్ణయం తీసుకున్నారనిఆయన అన్నారు. కాశ్మీరీల ప్రమేయం లేకుండా భారత్‌,పాకిస్థాన్‌లు చర్చలు జరుపుతున్నాయని, అటువంటిసందర్భంలో ముషరాఫ్‌ ఇచ్చే టీ పార్టీకిహాజరు కావడంలో అర్థం లేదని ఆయన అన్నారు.

ఇదిలా వుండగా, 1931 సంఘటనఅమర వీరుల స్మరణార్థం హురియత్‌కాన్ఫరెన్స్‌ శ్రీనగర్‌లో బంద్‌కుపిలుపునిచ్చింది. బంద్‌ సందర్భంగా ఏ విధమైన అవాంఛీనయ సంఘటనలూజరగలేదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X