హవేలీలోముషారఫ్ పురాజ్ఞాపకాలు
న్యూఢిల్లీ:భారత్లో అధికార పర్యటనకోసం వచ్చినపాక్ అధినేత జనరల్ ముషారఫ్ను ఆపురాతన హవేలీ ఎక్కడికోతీసుకువెళ్లింది. ఢిల్లీ పాతబస్తీలోని దర్యాయాగంజ్లో వున్న నెహర్వాలీ హవేలీనిశనివారం నాడు ముషారఫ్ తన అర్దాంగి షెబాతోకలసి సందర్శించారు. ఈ హవేలీలోనే ముషారఫ్పూర్వీకులు దేశ విభజనకు ముందు నివసించారు.హవేలీలో తన చిన్ననాట తమకుటుంబానికి సేవ చేసిన అనరో అనే వృద్ధురాలినిముషారఫ్ కలుసుకున్నారు. ముషారఫ్ను చూసినఆ వృద్ధురాలు ఆప్యాయంగా ఆలింగనం చేసుకునిపాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూకన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ సంఘటన ముషారఫ్నుకూడా కదిలించినట్టుగా కనిపించింది. ఆ వృద్ధురాలికిఆయన రెండువందల డాలర్లు బహుకరించారు.
హవేలీలోవున్నంత సేపు ముషారఫ్ ఉల్లాసంగా కనిపించారు.పాత జ్ఞాపకాల్లోకి వెళ్లిపోతు అక్కడ జరిగినమార్పులను అడిగి తెలుసుకున్నారు.హవేలీలో ఆ ప్రాంతంలో వచ్చిన మార్పుచేర్పులపై ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శననుతిలికించారు. హవేలీ వాసులు అందించినషర్బత్ను తాగారు. ఢిల్లీలోని పురాతనహవేలీలపై పుస్తకాన్ని కూడా ముషారఫ్కుబహుకరించారు. హవేలీ వద్ద ఢిల్లీలెఫ్ట్నెంట్ గవర్నర్ విజయ్కపూర్ ఎంపి విజయ్గోయల్ తదితరులు ఆయనకు స్వాగతంపలికారు. హవేలీ వెనకే వున్న సినిమాహాల్లో దేశవిధజనకు సంబంధించినఇతివృత్తంతో తీసిన చిత్రం గదర్ ప్రదర్శిస్తుండటంగమనార్హం. హవేలీలో ముషారఫ్ 20 నిమిషాలపాటుతన్మయత్వంతో గడిపారు.