వాజ్పేయి కొనసాగాల్సిందే: బాబు
న్యూఢిల్లీ: అటల్బిహారీ వాజ్పేయి ప్రధాని పదవిలో కొనసాగాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. ప్రధాని రాజీనామా చేయకూడదని ఆయన మంగళవారంవిలేకరులతో అన్నారు. ఆరోపణలను సమర్థంగా ఎదుర్కోవాలి తప్ప రాజీనామా చేయడం సరికాదని ఆయన అన్నారు.
మిగతా భాగస్వామ్య పక్షాలు కూడా వాజ్పేయి కొనసాగాల్సిందేనని అభిప్రాయపడ్డాయి. సోమవారం నాడు ప్రధాని కార్యాలయంపై తీవ్రవిమర్శలు చేసిన శివసేన కూడా మెత్తబడింది. శివసేన నేత సంజయ్ నిరుపమే చేసిన ఆరోపణలు ప్రధానిని ఉద్దేశించినవి కావని శివసేన పార్లమెంటు సభ్యుడొకరు అన్నారు. ఈ వ్యవహారంపై తమ అధినేత బాల్ థాకరే నిర్ణయం తీసుకోవాల్సిందేనని మరో శివసేన పార్లమెంటు సభ్యుడు అనంత్ గీతే అన్నారు. ప్రధాని రాజీనామా వ్యవహారంపై వ్యాఖ్యానించడానికి ముంబాయిలో బాల్ థాకరే నిరాకరించారు.
ఒరిద్దరు
చేసిన
విమర్శలను
ప్రధాని
పట్టించకోవద్దని
ఎండిఎంకె
అభిప్రాయపడింది.
కఠిన
నిర్ణయాలు
తీసుకుంటే
తప్ప
ఎన్డిఎను
సమర్థంగా
నడపడం
సాధ్యం
కాదని
సమతాపార్టీ
వ్యాఖ్యానించింది.
ఇదిలా
వుండగా,
యుటిఐ
స్కామ్పై
తమ
పార్టీకి
చెందిన
సంజయ్
నిరుపమే
చేసిన
ఆరోపణలతో
పార్టీకి
సంబంధం
లేదని
శివసేన
అధినేత
బాల్
థాకరే
తమకు
చెప్పినట్లు
బిజెపి
వర్గాలు
వెల్లడించాయి.