ఎట్టకేలకు చిత్తూరు హస్తగతం
తిరుపతి: చిత్తూరు జిల్లా పరిషత్ ఎట్టకేలకు హస్తగతంఅయింది. చిత్తూరు జిల్లా పరిషత్ చైర్ పర్సన్గా ఎస్. రెడ్డమ్మ ఎన్నికయ్యారు. వైస్ చైర్పర్సన్గా పెద్ది రెడ్డి గెలుపొందారు. చిత్తూరు జిల్లా కాంగ్రెస్లోని విభేదాల కారణంగా రెండు సార్లు చిత్తూరు జిల్లా పరిషత్ అధ్యక్ష, ఉపాధ్య పదవులకు జరగాల్సిన ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఎట్టకేలకు గురువారం ఎన్నికలు జరిగాయి. తెలుగుదేశం పార్టీ కన్నా ఒక్క జడ్పిటిసి సభ్యుడు మాత్రమే ఎక్కువగా వున్న కాంగ్రెస్ చిత్తూరు జిల్లా పరిషత్నుకైవసం చేసుకోవడానికి తంటాలు పడాల్సి వచ్చింది.
జిల్లా పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు అభ్యర్థులను ఎంపిక చేయడంలో విభేదాలు తలెత్తాయి. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పిసిసి) అధ్యక్షుడు ఎం. సత్యనారాయణరావు, కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ(సిఎల్పి) నేత డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి జోక్యం చేసుకున్నా విభేదాలు సద్దుమణగలేదు. కాంగ్రెస్ శాసనసభ్యుడుసి.కె. బాబుపై చర్య తీసుకోవడానికి కూడా పిసిసి సిద్ధపడింది. అయితే, చివరగా రాజశేఖర్ రెడ్డిసి.కె. బాబును హైదరాబాద్ రప్పించి మాట్లాడారు. మొత్తంమీద కాంగ్రెస్కు కథ సుఖాంతమయింది.