ఆంధ్రకు 1145కోట్ల అదనపు నిధులు
న్యూఢిల్లీః
ఆంధ్ర
ప్రదేశ్
వార్షిక
ప్రణాళికా
మొత్తం
1145
కోట్లు
రూపాయల
మేరకుపెరిగింది.
వచ్చే
ఆర్థిక
సంవత్సరానికి
రాష్ట్ర
ప్రణాళికా
పెట్టుబడిని
8,378
కోట్లు
రూపాయలుగా
11వ
ప్రణాళికా
సంఘం
ఉపాధ్యక్షుడుకె.సి.
పంత్
శుక్రవారం
నిర్ణయించారు.
ముఖ్యమంత్రి
చంద్రబాబు
నాయుడు
శుక్రవారం
కె.సి.పంత్
ను
కలుసుకొని
ప్రణాళికపై
సుదీర్ఘంగా
చర్చలు
జరిపారు.
రాష్ట్రం
అవలంబిస్తున్న
ఆర్థిక
విధానాలను
పంత్
ప్రశంసించారు.
వచ్చే
ఆర్థిక
సంవత్సరానికి
8,900
కోట్ల
రూపాయలను
ప్రణాళికా
పెట్టుబడిగా
సాధించాలని
రాష్ట్ర
ప్రభుత్వం
భావించింది.
అయితే
గత
ఏడాదికంటే
1145
కోట్ల
రూపాయలు
అదనంగా
8,378
కోట్లు
రూపాయలు
సాధించ
గలిగింది.
9 వ పంచవర్ష ప్రణాళికా లక్ష్యాలలో ఆంధ్ర ప్రదేశ్ ఇప్పటికే 85 శాతం లక్ష్యాలు సాధించిందని పంత్ చెప్పారు. మెరుగైన ఫలితాలు సాధించిన ఆంధ్ర ప్రదేశ్ కు వివిధ పథకాల కిందవీలైనన్ని ఎక్కువ నిధులు మంజూరు చేయాలని యోచిస్తున్నట్లు పంత్వివరించారు. డి.పి.ఎ.పి. పథకం కింద ఆంధ్రప్రదేశ్ కు అదనపు నిధులు ఇచ్చే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు కూడా ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంవిద్యుత్ రెగ్యులేటరీ కమిటీ ఏర్పాటు చేసి ఎన్నో సంస్కరణలు చేపట్టిందని పంత్ ప్రశంసించారు.
-
విద్యుత్
సంస్కరణలపై
బాబుకు
కితాబు