వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
న్యోయవిచారణకు జయ ఆదేశం
చెన్నైః చెన్నైలో ఆదివారం నాడు డిఎంకె నిర్వహించిన భారీ ప్రదర్శన సందర్భంగా చెలరేగిన హింసాకాండపై న్యాయవిచారణకు తమిళనాడు ప్రభుత్వం ఆదేశించింది. రిటైర్డ్ మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కెఎస్ భక్తవత్సలంతో విచారణ కమిషన్ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.
ర్యాలీ సందర్భంగా చెలరేగిన హింసాకాండకు సంబంధించిన అన్నిఅంశాలను విచారణ కమిషన్ పరిగణలోకి తీసుకుంటుందని ముఖ్యమంత్రి జయలలిత చెప్పారు. ఆదివారం నాటి హింసాకాండలో మరణించిన వారి కుటుంబాలకు 50 వేల రూపాయల నష్టపరిహారాన్ని ఆమె ప్రకటించారు. ఈ సంఘటనలో గాయపడి ఆస్పత్రి పాలయిన వారికి 15 వేల రూపాయల చొప్పున గాయపడిన వారికి 6 వేల రూపాయల చొప్పున నష్టపరిహారంఅందజేస్తారు. హింసాకాండకు డిఎంకె దే బాధ్యత అని ఆమె ఆరోపించారు. ఈ ఘర్షణల్లో పాత్రికేయులు గాయపడటం పట్ల ఆమెవిచారణ వ్యక్తం చేశారు.
- డిఎంకె ర్యాలీలో చెలరేగిన హింస
- ఉద్రిక్తతో అట్టుడుకుతున్న చెన్నయ్
- చెన్నయ్హింసపై అట్టుడికిన పార్లమెంటు
Comments
Story first published: Monday, August 13, 2001, 23:53 [IST]