ద్వేషంతోనే కుప్పంపైవిమర్శలు
హైదరాబాద్ః కుప్పం ప్రాజెక్టు రైతుల పాలిట వరప్రసాదమని తెలుగుదేశం పార్టీ బుధవారం నాడు ప్రకటించింది. కుప్పంలో ఇజ్రాయెల్ టెక్నాలజీ సహకారంతో చేపట్టిన ప్రాజెక్టు వల్ల ఎందుకు కొరగాని మెట్టభూముల్లో సిరులు పండుతున్నాయని తెలుగుదేశం అధికార ప్రతినిధి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్రకటించారు.
స్వామినాథన్తో సహా దేశంలో ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్తలంతా ఈ ప్రాజెక్టు సందర్శించి రాష్ట్ర ప్రభుత్వానికి పొగిడారని ఆయన చెప్పారు. కేవలం రాజకీయ ఉద్దేశ్యాలతో కుప్పం ప్రాజెక్టుపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తున్నదని ఆయన దుయ్యబట్టారు. ఎకరాకు రైతుకు కేవలం వెయ్యిరూపాయలు మాత్రమే ఖర్చు వుంటుందని ఆయన తెలిపారు. కాంగ్రెస్ చెబుతున్న లెక్కలన్నీ కాకిలెక్కలని ఆయనవిమర్శించారు.












Click it and Unblock the Notifications