వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఇస్లామాబాద్ః తాలిబన్లు, లాడెన్ సారధ్యంలోని అల్ ఖైదాకు చావుదెబ్బ తగిలింది. అమెరికా బాంబు దాడుల్లో లాడెన్ కుడిభుజం, అల్ ఖైదా అగ్రనేత మహ్మద్ అతీఫ్ హతమైనట్లు తెలుస్తున్నది. గత మంగళవారం కాబూల్ లోని ఓ ఇంటిపై ఆమెరికా యుద్ధ మానాలు బాంబుల వర్షం కురిపించాయి. ఆ దాడిలో అతీఫ్ హతమైనట్లు అమెరికా అధికారులు చెప్పారు.
గురు, శుక్రవారాల్లో కూడా అమెరికా యుద్ధ మానాలు కాందహార్ సరిహద్దుల్లో బాంబుల వర్షం కురిపించాయి. రంజాన్ మాసం ప్రారంభం తాలిబన్లుకు కష్టాలనే ుగిల్చింది. శుక్రవారం నాటి దాడుల్లో ఓ మసీదు ధ్వంసమైనట్లు వార్తలుఅందాయి. కాందహార్ పై జరిపిన దాడుల్లో కనీసం 25 మంది పౌరులు మరణించినట్లు భాస్తున్నారు. పరిస్థితి అనుకూలంగా మారడంతో నార్తరన్ అలయెన్స్సేనలు పట్టు బిగిస్తున్నాయి.
Comments
Story first published: Saturday, November 17, 2001, 23:53 [IST]