వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
హైదరాబాద్ః అనంతపురం జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులంతా తమ రాజీనామా పత్రాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అందజేశారు. జిల్లాలో కాంగ్రెస్ వారిపై జరుగుతున్న హత్యాకాండనైనా ఆపండి... లేదా మాకు రక్షణ కల్పించండంటూ అనంత కాంగ్రెస్ నేతలు సి.ఎల్.పి. నేత వై.ఎస్. రాజశేఖర రెడ్డి సారధ్యంలో రాజధానిలో ప్రదర్శన నిర్వహించారు. ముఖ్యమంత్రిని కలుసుకొనేందుకు సచివాలయంలోకి వెళ్ళబోగా వారిని అడ్డుకున్నారు. ఆ తరువాత వారంతా లోపలికి వెళ్ళేందుకు అనుమతించారు.
అనంతపురం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్ల్యేలు, 30 మంది మండలాధ్యక్షులు, నలుగురు మునిసిపల్ ఛైర్మన్లు, 36 మంది ఎంపిటిసిలు ముఖ్యమంత్రికి మూకుమ్మడి రాజీనామాలు సమర్పించారు. మాకు రక్షణ కల్పించండి లేదా మా రాజీనామాలు ఆమోదించండంటూ వారు భీష్మంచారు. అనంతలో హత్యాకాండను ఆపలేకపోయామని ముఖ్యమంత్రి చెప్పారని, ఇక dుదట హత్యాంకాండకు పాల్పడే వారు ఎవరైనా కఠిన చర్యలు తీసుకుంటామని చంద్రబాబు నాయుడు హాdు ఇచ్చినట్లు వై.ఎస్. రాజశేఖర రెడ్డి లేకరులకు చెప్పారు. ముఖ్యమంత్రి హాdు ఇచ్చినంత మాత్రాన అనంతలో రగులుతున్న హత్యాకాండలు ఆగతాయా అనేది ులియన్ డాలర్ల ప్రశ్న.
Comments
Story first published: Wednesday, November 21, 2001, 23:53 [IST]