వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హోమ్‌ పేజి

By Staff
|
Google Oneindia TeluguNews

కాబూల్‌ః అఎn్గానిస్తాన్‌ యుద్ధం ఆఖరు అంకంలోకి ప్రవేశించింది. తాలిబన్ల ఆఖరు బలమైన స్థావరం కుందుజ్‌ను కూడా అలయన్స్‌ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. సుమారు ఆరువేల మంది తాలిబన్‌ సైనికులు కుందుజ్‌లో అలయన్స్‌ ముందు లొంగిపోయారు. లొంగిపోయినవారిలో అత్యధిక శాతం మంది దేశీ సైనికులు వున్నారు.

కుందుజ్‌పై అలయన్స్‌ బలగాలు పట్టుసాధించడానికి ముందు ఇరువర్గాల
మధ్య భీకర స్థాయిలో ఘర్షణ జరిగింది. ఇరువర్గాలకు సంబంధించిన వందమంది పైగా సైనికులు మరణించినట్టుగా వార్తలు వచ్చాయి. కుందుజ్‌పై అమెరికన్‌ యుద్ధమానాలు భారీ ఎత్తున తక్కువ ఎత్తునుంచి బాంబులు ఎడాపెడా గుప్పించాయి.

అమెరికా బాంబు దాడుల్లో వందలాది మంది తాలిబన్లు మరణించినట్టుగా వార్తలు వచ్చాయి. లొంగిపోయిన వారిలో అఎn్గానిస్తాన్‌కు చెందని దేశీ సైనికులను వేరుచేయనున్నట్టుగా అలయన్స్‌ నేతలు చెప్పారు. దేశీ సైనికులను ఐక్యరాజ్యసుతికి అప్పగించనున్నట్టుగా వారు తెలిపారు. సాధారణ అఎn్గాన్‌ పౌరులను తామే డుదల చేస్తామని వారు చెప్పారు. మరోవైపు తాలిబన్ల అగ్రనేత ముల్లా ఒమర్‌, అల్‌ఖైదా అగ్రనేత బిన్‌లాడెన్‌ కాందహార్‌లోనే దాక్కొని వున్నట్టుగా సమాచారం అందడంతో వేలాది మంది అమెరికన్‌ సైనికులు ఇప్పుడు కాందహార్‌ను చుట్టుముట్టారు. కాందహార్‌ కొండకోనల్లోని అణువణువూ ఇప్పుడు అమెరికా దాని ుత్రపక్షాల కమెండోలు, అలయన్స్‌ బలగాలు గాలిస్తున్నాయి. నేడో రేపో ఈ ఇద్దరు పట్టుబడటం ఖాయమని dరిని పట్టుకోవడంతో అఎn్గాన్‌ యుద్ధంలో ప్రధాన అంకముగిసినట్టేనని అమెరికా చెబుతున్నది. ఇదిలా వుండగా మరోవైపు జర్మనీ రాజధాని బాన్‌లో అఎn్గాన్‌ భష్యత్తుపై కీలక సమావేశం మంగళవారం నాడు జరుగుతున్నది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X