వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బాన్:అఎn్ఘానిస్థాన్లో పాలన సాగించడానికి తాత్కాలిక మండలి ఏర్పాటుకు తమకు, మాజీ రాజు జహీర్ షా ప్రతినిధులకు మధ్య ఒప్పందం కుదిరిందని నార్తర్న్ అలయెన్స్ సలహాదారు మొహమ్మద్ హుస్సేన్ బక్షీ చెప్పారు.
మార్చిలో గిరిజనపెద్దల జాతీయ మండలి సమావేశం జరిగే వరకు ఈ తాత్కాలిక మండలి ద్వారా పరిపాలన సాగుతుందని ఆయన చెప్పారు.
ఈ ఒప్పందం పెద్ద మలుపు అని, ఈ ఒప్పందం కుదరకుండా చర్చలు ముందుకు సాగడం దుర్లభమవుతుందని బక్షి అన్నారు. తాత్కాలిక మండలిలో 42 మంది సభ్యులుంటారు. నార్తర్న్ అలయెన్స్కు, జహీర్ షాకు సంబంధించిన సభ్యులు చెరి సగం వుంటారు.
Story first published: Thursday, November 29, 2001, 23:53 [IST]