వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐఎస్‌ఐ కాశ్మీర్‌ విభాగం మూసివేత?

By Staff
|
Google Oneindia TeluguNews

ఖాట్మండుః సీమాంతర ఉగ్రవాదానికి పాల్పడుతున్న సంస్థలు, వ్యక్తులపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకున్నది పాకిస్తాన్‌ వెల్లడించాలని భారత ప్రధాని వాజ్‌పేయి డిమాండ్‌ చేశారు.

ఉగ్రవాద సంస్థలకు ఊతం ఇస్తూ, సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశాలను దారికి తెచ్చేందుకు ఒత్తిడి తేవాలని ఉగ్రవాదంపై పోరు ఎక్కుపెట్టిన అంతర్జాతీయ కూటమికి ఆయన విజ్ఞప్తి చేశారు.
భారత్‌ పార్లమెంట్‌పై, జమ్మూ కాశ్మీర్‌ అసెంబ్లీపై దాడులను ప్రజాస్వామ్యంపై దాడిగా ఆయన అభివర్ణించారు. టెర్రరిజంపై పోరుకు ఐక్యరాజ్య సమితి ఆమోదించిన రెండు తీర్మానాల అమలుకు ప్రపంచ దేశాలన్నీ కట్టుబడాలని వాజ్‌పేయి కోరారు. దక్షిణాసియా టెర్రరిస్టులకు నెలవుగా మారడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతం నుంచి టెర్రరిజాన్ని నిర్మూలించడానికి సార్క్‌ దేశాలన్నీ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఖాట్మండు చేరుకోవడానికి ముందు లక్నోలో జరిగిన ఒక సభలో మాట్లాడుతూ, ఇప్పటివరకు టెర్రరిస్టులకు వ్యతిరేకంగా నిర్ధిష్టంగా తీసుకున్న చర్యలను పాక్‌ తమకు వివరించాలని వాజ్‌పేయి డిమాండ్‌ చేశారు. పాక్‌ టెర్రరిజం అణిచివేతకు తీసుకుంటున్నట్టుగా చెబుతున్న చర్యలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X