వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్‌.ఆర్‌.ఐ.లకు భారత్‌ నజరానా

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః ఇక మీదట జనవరి 9ని ప్రవాసభారతీయుల దినోత్సవంగా పాటించనున్నట్లు భారత ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌ పేయి ప్రకటించారు. ఎన్‌.ఆర్‌.ఐ.డే నాడు పదిమంది ప్రముఖ ప్రవాసభారతీయులను ఏటా సత్కరించనున్నట్లు మంగళవారం నాడు ఆయన ప్రకటించారు. ప్రవాసభారతీయలతో జరిగిన ఓ కార్యక్రమంలో వాజ్‌ పేయి ప్రసంగిస్తూ ఎన్నారైలకు ద్వంద్వ పౌరసత్వం కల్పించే విషయాన్ని భారత్‌ సీరియస్‌ గా పరిశీలిస్తున్నదని వాజ్‌ పేయి వెల్లడించారు.

ప్రవాసభారతీయులకు వీలయినన్ని సౌకర్యాలు కల్పించాలన్నదే భారత్‌ అభిమతమని వాజ్‌ పేయి చెప్పారు. భారతజాతి కీర్తి పతాకాన్ని ప్రపంచం దశదిశలా ఎగురవేస్తున్న భారతీయుల్ని ఏటా జనవరి 9 నాడు సత్కరించనున్నట్లు ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X