పాక్ విజ్ఞప్తిని త్రోసిపుచ్చిన యుఎన్
ఐక్యరాజ్యసమితి: ఇండో- పాకిస్థాన్ల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి జోక్యం చేసుకోవాలని చేసిన పాకిస్థాన్ విజ్ఞప్తిని ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి త్రోసిపుచ్చింది. కాశ్మీర్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఉగ్రవాద సంస్థలపై కఠినంగా వ్యవహరించాలని భద్రతా మండలి పాకిస్థాన్కు సూచించింది.
ఉగ్రవాదంపై పోరు ప్రస్తుతం ప్రధానమైందని అంటూ, కాశ్మీర్లో కార్యకలాపాలు నిర్వహిస్తూ అమాయకులను పొట్టన పెట్టుకుంటున్న ఉగ్రవాద గ్రూప్లను పాకిస్థాన్ అణచివేయడం తక్షణావసరమని భద్రతా మండలి స్పష్టం చేసింది.
ఇండో- పాక్ల మధ్య ఉద్రిక్తతలను నివారించడానికి జోక్యం చేసుకోవాలని భద్రతా మండలి సమావేశంలో ఐక్యరాజ్య సమితిలోని పాకిస్థాన్ దౌత్యవేత్త షంషాద్ అహ్మద్ ఖాన్ కోరారు.












Click it and Unblock the Notifications
