వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శాంతికైనా,సమరానికైనా సిద్ధంఃభారత్‌

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః భారత సేనలు శాంతికైనా సమరానికైనా సిద్ధంగా వున్నాయని భారత్‌ సైనికదళాధిపతి జనరల్‌ పద్మనాభాన్‌ స్పష్టం చేశారు. భారత్‌ - పాక్‌ ల మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకున్న దరిమిలా శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సరిహద్దులో పరిస్థితి ఉద్రిక్తంగా వున్నదని అయితే ఏమాత్రం భయపడాల్సిన పని లేదని పద్మనాభన్‌ ధీమా వ్యక్తం చేశారు.

ప్రస్తుత పరిస్థితుల్లలో మనపై ఎవరైనా దాడి చేస్తే ప్రత్యర్థులను మట్టికరిపించేందుకు సైన్యం సర్వసన్నద్ధంగా వున్నదని ఆయన చెప్పారు. మన అణ్వాయుధాలే లక్ష్యంగా ఎవరైనా దాడి జరిపితే ఆ దాడిని తిప్పికొట్టేందుకు సైతం సిద్ధమని ఆయన వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ దేశమైన అణ్వాయుధాలను ఉపయోగించే ముందు వందసార్లు ఆలోచించాల్సిన అవసరం వుందని ఆయన చెప్పారు. తాజా పరిస్థితుల్లో పాకిస్తాన్‌ కు చైనా సాయం చేసే అవకాశాలు లేవని కూడా పద్మనాభన్‌ అభిప్రాయపడ్డారు. ప్రతిఏడాది మాదిరిగానే రిపబ్లిక్‌ దినోత్సవం సజావుగా సాగిపోతుందని ఆయన అన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X