వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓటును వ్యర్ధం చేసుకోవద్దు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః జంటనగరాల ప్రజలు అమూల్యమైన ఓటును వ్యర్ధం చేసుకోవద్దని ముఖ్యమంత్రి, తెలుగుదేశం నేత చంద్రబాబునాయుడు విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం, బిజెపి అభ్యర్ధుల తరఫున ఆయన బుధవారం నాడు బల్దియా ఎన్నికలకోసం సుడిగాలి పర్యటన జరిపారు. కాంగ్రెస్‌, మజ్లిస్‌ పార్టీలకు ఓటు వేయడం వల్ల ఓటు వ్యర్ధం అవుతుందని ఆయన చెప్పారు. టిఎస్‌ఎస్‌, టిఆర్‌ఎస్‌ వంటి విచ్ఛిన్న శక్తులను తరిమి కొట్టాలని ఆయన కోరారు. ఒక్క తెలుగుదేశం పార్టీ మాత్రమే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుందని ఆయన చెప్పారు. హైదరాబాద్‌లో తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కళ్లముందు కనిపిస్తున్నదని ఆయన చెప్పారు.

ముఖ్యమంత్రి పర్యటనలో స్వాగత సన్నాహాల కోసం అధికారులు యథాశక్తి స్కూల్‌ పిల్లలను సమీకరించారు. పిల్లలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, అభివృద్ధి చేసే తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాల్సిందిగా తల్లితండ్రులపైనా ఇంట్లోని పెద్దలపైనా పిల్లలే ఒత్తిడి తేవాలని ముఖ్యమంత్రి కోరారు. పాతబస్తీలోని కొన్ని ప్రాంతాల్లో ఉర్దూలో ఆయన ప్రసంగించారు. తెలుగులో రాసుకున్న స్క్రిప్ట్‌ చూస్తూ ఉర్దులో ఆయన చేసిన ప్రసంగం మజ్లిస్‌కు వ్యతిరేకంగా సాగింది. ఉర్దూలో ఒక కవితను కూడా ముఖ్యమంత్రి వినిపించారు. ఇప్పుడు తనకు ఉర్దు రాదని త్వరలోనే నేర్చుకుని ప్రసంగిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి వెంట తీగల కృష్ణారెడ్డి తెలుగుదేశం, బిజెపి అభ్యర్ధులు కూడా పాల్గొన్నారు. గోల్కొండ కోటనుంచి ప్రారంభించి పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X