ప్రైవేట్ రంగానికి రాష్ట్రపతి పిలుపు
న్యూఢిల్లీ:
బడుగు
వర్గాల
అభివృద్ధికి
సామాజిక
విధానాలను
అనుసరించాలని
రాష్ట్రపతికె.ఆర్.
నారాయణన్
ప్రైవట్
రంగానికి
సూచించారు.
ప్రస్తుత
ఆర్థిక
విధానంలో,
భవిష్యత్తులో
నిర్లక్ష్యానికి,
అసమానతలకు
గురవుతున్న
బడుగు
వర్గాల
అభ్యున్నతికి
ప్రగతిశీలమైన,పేదరిక
నిర్మూలన
కార్యక్రమాలను
చేపట్టాలని
ఆయన
ప్రైవేట్
రంగానికి
పిలుపునిచ్చారు.
రిపబ్లిక్
డే
సందేశంలో
ఆయన
శుక్రవారం
ఆయన
పిలుపునిచ్చారు.
ప్రజా సమూహాల సమస్యల పరిష్కారంపై దృష్టి పెడితే శాంతి, సహజీవనం దిశగా దేశం బలంగా ముందుకు సాగుతుందని, భారత్తో పాటు ప్రపంచం ఎదుర్కుంటున్న తీవ్రవాదానికి మన దేశం చెప్పే ప్రజాస్వామిక సమాధానం ఇదే అవుతుందని ఆయన అన్నారు.
సంపూర్ణ సామర్థ్యానికి ఆర్థిక పటిష్టతను, రక్షణ సామర్థ్యాన్నిపెంచుకోవాల్సిన అవసరం వున్నదని ఆయన అన్నారు. తన ఐదుపేజీల సందేశంలో నారాయణన్ శిశు సంక్షేమం, పంచాయతీరాజ్, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను ప్రస్తావించారు.
దేశ భద్రత గురించి గానీ, ప్రస్తుతం భారత్- పాక్ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల గురించిగానీ రాష్ట్రపతి ప్రస్తావించకపోవడం విశేషం.
దాదాపు పది లక్షల మంది స్త్రీలు పంచాయతీరాజ్ సంస్థలకు ఎన్నిక కావడం వల్ల వాటి కార్యక్రమాల్లో, ఆచరణలో కింది స్థాయిలో వ్యూహాత్మక మార్పు వచ్చిందని ఆయన అన్నారు. మహిళా ఉద్యమం వేగవంతమవుతోందని, మరో మైలురాయిని చేరుకోబోతోందని ఆయన అన్నారు. ఇప్పటికీ మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
పిల్లల సక్రమ అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఈ మానవ సంపద అభివృద్ధిపై దేశ భవిష్యత్తు ఆధారపడి వుంటుందని, ఇది పిల్లల ఆరోగ్యం, సంక్షేమాలపై ఆధారపడి వుంటుందని ఆయన చెప్పారు.