వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐదుగురు చొరబాటుదారుల కాల్చివేత

By Staff
|
Google Oneindia TeluguNews

శ్రీనగర్‌ః జమ్ముకాశ్మీర్‌ లోని రాజోరి ప్రాంతంలో పాక్‌ నుంచి భారత్‌ లోకి అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నించిన వారిని భారత దళాలు కాల్చి చంపాయి. అత్యంత అధునాతన ఆయుధాలతో పలువురు పాకిస్తాన్‌ చొరబాటుదారులు మంగళవారం రాత్రి భారత భూభాగంలోకి చొరబడేందుకు ప్రయత్నించారు. భారత్‌సేనలు అప్రమత్తమై చొరబాటుదారులపై కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఐదుగురు పాకిస్తానీ చొరబాటు దారులు మరణించారని అధికారులు చెప్పారు.

ఇదిలా వుండగా భారత-పాకిస్తాన్‌ లు సరిహద్దులో కాల్పులు జరుపుకోవడం సహహద్దు గ్రామాల ప్రజలకు శాపంగా పరిణమించింది. మంగళవారం నాడు భారత్‌ ప్రయోగించిన ఓ రాకెట్‌ పాక్‌ భూభాగంలో వున్న గ్రామంపై పడింది.ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఈ ప్రమాదంలో మరణించారు. భారత-పాక్‌ లో యుద్ధానికిస్వస్థి చెప్పి శాంతియుత పథంలో నడవాలని సరిహద్దు ప్రజలు కోరుతున్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X