వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అయోధ్యలో పూజకు సుప్రీంకోర్టు నో

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః అయోధ్యలో పూజ నిర్వహించేంకు అనుమతి ఇవ్వరాదని, అక్కడ యథాతథ స్థితిని కొనసాగించాలని సుప్రీంకోర్టు బుధవారం స్పష్టం చేసింది.వివాదరహిత స్థలం కూడా ప్రభుత్వ అధీనంలో వున్నది కాబట్టి అక్కడ ఎటువంటి మతపరమైన కార్యకలాపాలు నిర్వహించరాదని సుప్రీంకోర్టు తీర్పుచెప్పింది. అంతకు ముందు ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టులో మాట్లాడిన సోలి సొరాబ్జి అయోధ్యలో నామమాత్ర పూజకు అనుమతించాల్సిందిగాకోరారు. అయోధ్యలో ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్న దరిమిలా లాంఛనప్రాయమాన పూజకు అనుమతించాలని సొరాబ్జికోరారు.

అయోధ్యలో యథాతథ స్థితిని కొనసాగించాల్సిందిగా 1994నాటి ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నప్పడు భూమి పూజకు ఎలా అనుమతించాలని సుప్రీంకోర్టు సొరాబ్జిని ప్రశ్నించింది.వివాదాస్పద స్థలానికి పూజ నిర్వహించేందుకు ఉద్దేశించిన స్థలం చాలా దూరంలో వున్నదని, కేవలం 60 నుంచి 70 మంది సాధువులు పూజలు నిర్వహిస్తారని ఆయన చెప్పారు. ప్రభుత్వంస్వాధీనం చేసుకున్న స్థలంలోకి కరసేవకుల్ని అనుమతించే ప్రసక్తి లేదని ఆయన చెప్పారు. యథాతథ పరిస్థితి కొనసాగించాల్సిందిగా గతంలో చెప్పిన సుప్రీంకోర్టు ఇప్పుడు ఎటువంటి పూజకైనా ఎలా అనుమతిస్తుందని న్యాయమూర్తులు ప్రశ్నించారు.

లాంఛనప్రాయమైన పూజకు సైతం సుప్రీంకోర్టు అనుమతి నిరాకరించడంతో మార్చి 15నవిశ్వహిందూ పరిషత్‌ ఏం చేస్తుందో వేచి చూడాలి. ఈ తీర్పుతో వాజ్‌పేయి గుండెల మీద నుంచి సగం బరువు దిగిపోయినట్లయింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X