వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సంఘ్‌పై బిజెపి ఎంపీల్లో అసంతృప్తి

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః విశ్వహిందూ పరిషత్‌, బజరంగ్‌ దళ్‌ వంటి సంస్థలతో తెగతెంపులు చేసుకోవాలని బిజెపికి చెందిన కొందరు ఎంపీలు పార్టీ నాయకత్వాన్ని గట్టిగా కోరుతున్నారు. మంగళవారం నాడు ప్రధాని వాజ్‌పేయి అధ్యక్షతన జరిగిన బిజెపి పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సంఘ్‌పరివార్‌ ధోరణిపై విమర్శలు వెల్లువెత్తాయి.

సంఘ్‌పరివార్‌తో సంబంధాల వల్లే ఇటీవల జరిగినఅసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి పరాజయం పాలయిందని ఎంపీలు అభిప్రాయపడ్డారు. ఎన్‌డిఎ ఎజెండాకు కట్టుబడి వుండాల్సిన బాధ్యత బిజెపిపై వున్నదని వారు చెప్పారు. అయితే ఈ వాదనను మరో గ్రూప్‌ తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రభుత్వం చేజారినాసరే సంఘ్‌వార్‌తోనే బిజెపి వుండాలని వారు వాదించారు. సమస్య పరిష్కారానికి ఒక మార్గాన్ని బిజెపినే సాధించాల్సి వున్నదని ఇరు వర్గాల వాదనవిన్న వాజ్‌పేయి చెప్పారు. ప్రధానిగా నాలుగేళ్ల కాలాన్నివిజయవంతంగా పూర్తి చేసిన ప్రధానిని ఎంపీలు అభినందించారు.వివాదాస్పద అంశాలపై ఆత్మవిమర్శ అవసరమని ప్రధాని అభిప్రాయపడ్డారు. చర్చల ద్వారావివాదాస్పద సమస్యలను పరిష్కరించడానికే సంకీర్ణం అని ఆయన చెప్పారు.
ఒరిస్సా అసెంబ్లీ పై దాడి సంఘటన పట్ల హోం మంత్రి అద్వానీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X