వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పత్తి రైతుల గోడు పట్టని ప్రభుత్వం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః పత్తి రైతుల విషయంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నదని ప్రతిపక్ష సభ్యులు మంగళవారం నాడు అసెంబ్లీలో ఆరోపించారు. కరీంనగర్‌, వరంగల్‌ జిల్లాలో వందలాది మంది రైతులు పంటను మార్కెట్‌యార్డలో పెట్టుకుని కొనేనాధుడు లేక గోడుగోడున విలపిస్తున్నారని వారు పేర్కొన్నారు.

సిపిఎం పార్టీ ఇచ్చిన వాయిదా తీర్మానంపై ప్రకటన చేసిన వ్యవసాయ శాఖ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కొనుగోలు చేసిన దానికంటే ఎక్కువ మొత్తంలో పత్తిని రాష్ట్రంలోని రైతుల నుంచి సిసిఐ కొనుగోలు చేసిందని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్రంపై వత్తిడి చేసిన ఫలితంగా ఇది సాధ్యమయిందని ఆయన చెప్పారు. అయితే మంత్రి చెబుతున్నదానికి జిల్లాల్లో కనిపిస్తున్న వాస్తవానికి ఎంతో తేడా వున్నదని మద్దతు ధరవిషయం పక్కనబెట్టి కనీస గిట్టుబాటు ధరను కూడా వ్యాపారులు ఆఫర్‌ చేయడం లేదని మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోళ్లు జరిపిస్తామని చెప్పిన ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని వారు ప్రశ్నించారు. ప్రభుత్వం సమాధానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ,సిపిఎం, టిఆర్‌ఎస్‌ సభ్యులు సభనుంచి వాకౌట్‌ చేశారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X