వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సింఘాల్‌ ఆమరణ దీక్షవిరమణ

By Staff
|
Google Oneindia TeluguNews

అయోధ్య: విశ్వ హిందూ పరిషత్‌ (విహెచ్‌పి) అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడుఅశోక్‌ సింఘాల్‌ సోమవారం రాత్రి ఆమరణ నిరాహార దీక్షనువిరమించారు. అయోధ్యకు తరలి వచ్చిన రామసేవకులకు భద్రత కల్పించాలని, వారు తమ తమ ప్రాంతాలకు క్షేమంగా తిరిగి వెళ్లడానికి రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేస్తూ ఆయన ఆదివారం దీక్ష ప్రారంభించారు.

రామసేవకులపై ఆంక్షలు ఎత్తివేయడంతో పాటు అయోధ్యను సందర్శించే రామసేవకులకు రక్షణ కల్పిస్తామని ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ హామీ ఇవ్వడంతో సింఘాల్‌ దీక్షవిరమించారు. కరసేవక్‌పురంలో దీక్షకు కూర్చున్న సింఘాల్‌కు వ్యవసాయ శాఖ సహాయ మంత్రి హుకుందేవ్‌ నారాయణ్‌ యాదవ్‌ సమక్షంలో రామజన్మభూమి న్యాస్‌ అధ్యక్షుడు రామచంద్రదాస్‌ పరమహంస గ్లాసులో పళ్ల రసంఅందించారని, మంగళవారం నుంచి అయోధ్యకురైళ్లరాకపోకలు ప్రారంభమవుతాయని విహెచ్‌పి వర్గాలు చెప్పాయి.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X