మందిర్ సాక్షిగా ప్రేమ జంట ఆత్మహత్య
హైదరాబాద్:పెద్దలు తమను విడదీస్తారనే భయంతో ఓ ప్రేమ జంట సోమవారం హైదరాబాద్లోని బిర్లా మందిర్పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. బిర్లా మందిర్లో వృద్ధులు,వికలాంగుల కోసం ఏర్పాటు చేసిన లిఫ్ట్ పైనుంచి కిందకు దూకి ఈ ప్రేమికులు ప్రాణాలు విడిచారు. ఒకరు ఆంజనేయస్వామి వద్ద ప్రాణాలు వదలగా మరొకరు శివ మందిరం వద్ద తుదిశ్వాస విడిచారు.
ప్రియదర్శిని అంగీకరించినా చంద్రశేఖర్ ఒప్పుకోలేదు. తర్వాత తాము ఏకాంతంగా పది నిమిషాలు మాట్లాడుకుంటామని చెప్పడంతోస్నేహితులు దూరంగా వెళ్లిపోయారు. కొద్ది సేపటికి తిరిగి వచ్చారు. అయితే తమకు మరి కొంత సమయం కావాలని ప్రేమికులు అడిగారు. మళ్లీ వాళ్లు దూరంగా వెళ్లిపోయారు. అలా వెళ్లిన కొద్దిసేపటికే శివాలయం వద్ద పెద్ద శబ్దం వినిపించింది. వారు పరుగెత్తుకొచ్చే సరికి మందిర్లిఫ్ట్కు వెళ్లే వంతెన మీది నుంచి ప్రియదర్శిని కిందికి దూకి ప్రాణాలు విడిచింది. చంద్రశేఖర్ కిందకు దూకుతూ కనిపించాడు. అక్కడున్న ప్రజలు వద్దని వారించినా వినకుండాపైన అటూ ఇటూ పరుగెత్తి కిందికి దూకేశాడు. చంద్రశేఖర్ 45 నిమిషాల పాటుఅపస్మారక స్థితిలో వున్నాడు. చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మరణించాడు.












Click it and Unblock the Notifications
