శ్రీనగర్: ఉత్తర కాశ్మీర్లోనికుప్వారాలోని భద్రతా బలగాలకు మిలిటెంట్లు గురిపెట్టిన శక్తివంతమైన మందుపాతర పేలి ఇద్దరు పాఠశాల పిల్లలు మరణించారు. మరో ఐదుగురు గాయపడ్డారు. ఈ సంఘటన బుధవారం జరిగింది.
మిలిటెంట్లు టేకిపొరాలోని లోలబా వద్ద ప్రధాన రహదారిపై మందుపాతర అమర్చి,సైనిక అధికారుల కాన్వాయ్ వెళ్లడం గమనించి దాన్నిపేల్చారు. ఆ సమయంలో పాఠశాలకు వెళ్తున్నారు. ఏడుగురువిద్యార్థుల్లో ఇద్దరు ఈ దుర్ఘటనలో మరణించారు. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు. ఇందులో ఒక బాలిక పరిస్థితి ఆందోళకరంగా ఉంది.