వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇద్దరు మిలిటెంట్లు, ముగ్గురు పోలీసులు మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

జమ్మూ: జమ్మూ డివిజన్‌లో శనివారం రాత్రి నుంచి జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో ఇద్దరుమిలిటెంట్లు, ముగ్గురు పోలీసులు మరణించారు. ట్రాన్సిస్టర్‌ బాంబు పేలుడు సంఘటనలో ఇద్దరు పిల్లలు గాయపడ్డారు.

మరణించినమిలిటెంట్లలో హిజ్‌బుల్‌ ముజాహిదీన్‌ ఏరియా కమాండర్‌ ముక్తియార్‌ అహ్మద్‌ ఉన్నాడు. పూంఛ్‌ జిల్లా సురాన్‌కోట్‌లోని మల్హాన్‌ గ్రామంలో భద్రతా బలగాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇతను మరణించాడు. ఒక ఎకె-56రైఫిల్‌ను, రెండు ఆర్‌పిజి రౌండ్స్‌ను, మూడు హ్యాండ్‌ గ్రెనేడ్స్‌ను, కొన్ని పత్రాలను సంఘటనా స్థలం నుంచిస్వాధీనం చేసుకున్నారు.
రాజౌరి జిల్లా కాలకోట్‌లో జరిగిన మరో ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు పోలీసులు, ఒక లష్కర్‌-ఎ- తోయిబామిలిటెంట్‌ మరణించారు. ఇద్దరు భద్రతాధికారులు గాయపడ్డారు. మరణించిన లష్కర్‌మిలిటెంట్‌ను అబు అమూ అలియాస్‌ అబ్దుల్‌ సిత్తార్‌గా గుర్తించారు.

ఉద్ధంపూర్‌ జిల్లా తగన్‌ గ్రామంలో ట్రాన్సిస్టర్‌ బాంబుపేలి ఇద్దరు పిల్లలు గాయపడ్డారు. పొలంలో పడి ఉన్న ట్రాన్సిస్టర్‌ను చూసిన పిల్లలు దాన్ని విడదీయడానికి ప్రయత్నించారు. ఈ సందర్భంలో ఈ ప్రమాదం సంభవించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X