వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారీగా పాస్‌పోర్టుఫీజుల పెంపు

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పాస్‌పోర్టుఫీజును ప్రభుత్వం భారీగా పెంచింది. సాధారణ పాస్‌పోర్టులకు ఇక ముందు వేయి రూపాయలు చెల్లించాల్సి వుంటుంది. ఇప్పటి వరకు ఈఫీజు 300 రూపాయలు మాత్రమే వుంది. పెంచిన పాస్‌పోర్టుఫీజు ఏప్రిల్‌ ఒకటవ తేదీ నుంచి అమలులోకి వస్తుంది. పాస్‌పోర్టుఫీజును పెంచుతూ ప్రభుత్వం గురువారం ఒక ప్రకటన చేసింది.

అరవై పేజీలుండే జంబో పాస్‌పోర్ట్‌లఫీజు 800 రూపాయల నుంచి 1,500 రూపాయలకు పెరిగింది. పాస్‌పోర్టుల జారీలోపెరిగిన ఖర్చును, కంప్యూటరైజేషన్‌, ఇతర సౌకర్యాల ద్వారా కార్యాలయాల ఆధునీకరణకు అయ్యే ఖర్చులను దృష్టిలోపెట్టుకుని పాస్‌పోర్టు ఫీజులను పెంచినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పాస్‌పోర్టుల, కోఆర్డినేషన్‌, డయాస్పోరా కార్యదర్శి జె.సి. శర్మ చెప్పారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X